Saturday, August 29, 2020

ఏకాంతంగా తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు

 All set for Tirumala Tirupati Brahmotsavam

కొవిడ్‍ కేసులు పెరుగుతున్నందున సెప్టెంబరు 19 నుంచి జరిగే తిరుమల శ్రీనివాసుడి వార్షిక బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి చైర్మన్‍ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అధిక మాసం వల్ల ఈ ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు వచ్చాయని, అక్టోబరులో జరిగే వేడుకలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మండలి సమావేశం తిరుమలలోని అన్నమయ్య భవన్‍లో సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈవో అనిల్‍ కుమార్‍ సింఘాల్‍, అదనపు ఈవో ధర్మారెడ్డి, సభ్యులు భాస్కర్‍రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి, శివకుమార్‍, దామోదర్‍రావు నేరుగా హాజరుకాగా, సుధా నారాయణ మూర్తి, రామేశ్వరరావు, కరుణాకర్‍ ఆన్‍లైన్‍లో పాల్గొన్నారు.

No comments:

Post a Comment