Friday, May 15, 2020

గుంటూరులో 500 పేద కుటుంబాలకు నాట్స్ సాయం.

గుంటూరులో 500 పేద కుటుంబాలకు నాట్స్ సాయం.
తెలుగునాట లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన వంతు సాయం చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే గుంటూరు నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలోని ప్రగతి నగర్, మదర్ థెరిస్సా, కాలనీలలో 500పేద కుటుంబాలకు నాట్స్ నిత్యావసరాలను పంపిణీ చేసింది.
నాట్స్ ఉపాధ్యక్షులు నూతి బాపయ్య చౌదరి ఆర్థిక సాయంతో నాట్స్ ఈ నిత్యావసరాలను సామాజిక దూరం పాటిస్తూ పేదలకు అందించింది. శాసనమండలి సభ్యులు కె.ఎస్.లక్ష్మణరావు చేతుల మీదుగా పేదలకు ఈ సాయం చేయడం జరిగింది. గుంటూరు నగరంలో లాక్‌డౌన్‌తో ఉపాధి లేక పేదలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న విషయం బాపయ్య చౌదరి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఆయన స్పందించి 500 పేద కుటుంబాలకు సాయం చేయడం నిజంగా అభినందనీయమని లక్ష్మణరావు అన్నారు..
భవిష్యత్తులో కూడా పేదలకు, పేద విద్యార్ధులకు సాధ్యమైనంత సాయం చేయాలని ఆయన కోరారు. సేవే గమ్యం అనే నినాదం తో నాట్స్ ఇలాంటి మరెన్నో భవిష్యత్‌ కార్యక్రమాల ద్వారా నిరూపిస్తుందని నాట్స్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి పేర్కొన్నారు.

మహేష్ తో ఒకసారి మిస్ చేసుకున్నా....ఈ సారి వదిలిపెట్టను - క్వీన్ కంగ‌నారౌన‌త్

మహేష్ తో  ఒకసారి మిస్ చేసుకున్నా....ఈ సారి వదిలిపెట్టను - క్వీన్ కంగ‌నారౌన‌త్
జాతీయ స్థాయిలో నటనా పరంగా ప్రతిభ వున్నా నటి క్వీన్ కంగ‌నారౌన‌త్. ఆమె పర్సనల్ విష‌యానికి వస్తే త‌న‌కు ఏది మ‌న‌సుకు అనిపిస్తే దానిని నిర్మోహ‌మాటంగా, ఎదుటి వారు బాధ‌ప‌డతారేమో అనే ఆలోచ‌న లేకుండా ముఖం మీద‌నే చెప్పేయ‌డం కంగనా నైజం. అంద‌రు అది పొగ‌రు అంటే ఆమె మాత్రం దానిని త‌న ముక్కుసూటిత‌నం అని అంటుంది. ఆమె ప్ర‌వ‌ర్త‌న కొంద‌రికి మాత్రం బాగా న‌చ్చుతుంది. కానీ ఇదే ముక్కుసూటిత‌నం ఈమెని ప‌లు వివాదాల్లో ఉంటుంది. ఈమె చేసింది ఒకే ఒక తెలుగు చిత్రం ఏక్ నిరంజ‌న్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో డార్లింగ్ ప్ర‌భాస్ హీరోగా న‌టించిన ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టించిన విష‌యం తెలిసిందే. అప్పట్లో అందిరితో కలివిడిగా వుండే అజాత శత్రువు డార్లింగ్ ప్ర‌భాస్ తో కూడా ఈమె ఏక్ నిరంజ‌న్ స‌మ‌యంలో గొడ‌వ ప‌డింద‌ని అంటారు. ఇక త‌న మాజీ బోయ్ ఫ్రెండ్ హృతిక్ రోష‌న్ నుంచి దీపికా ప‌డుకోనే వ‌ర‌కు అంద‌రు ఈమె టార్గెట్ కి గురైన‌వారే. అలాగ‌ని త‌న తీరుని మార్చుకునే ర‌కం కాదు ఈమె. తాజాగా ఈమె ఓ ఇంట‌ర్వ్యూలో తాను మిస్ అయిన ప‌లు చిత్రాల గురించి చెప్పుకొచ్చింది.
మ‌హేష్ బాబు కెరీర్ లోనే పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కత్వంలో వ‌చ్చిన పోకిరి చిత్రం టాలీవుడ్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. పోకిరి మూవీ ఓ ట్రెయిన్డ్ సెట్ చేసి మ‌హేష్ ప్రిన్స్ స్థాయి నుంచి టాలీవుడ్ సూప‌ర్ స్టార్ అయ్యాడు. 2006లో విడుద‌లైన పోకిరి చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా న‌టించింది. పోకిరి త‌ర్వాత ఇలియానా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఏకంగా టాలీవుడ్‌లోనే కోటి రూపాయ‌ల పారితోషికం తీసుకునే స్థాయికి చేరుకుంది. అయితే ఈ చిత్రంలో మొదట మ‌హేష్‌తో న‌టించే అవ‌కాశం క్వీన్ కంగ‌నా రౌన‌త్‌కి వ‌చ్చింద‌ట‌. ఈ విష‌యాన్ని కంగ‌నానే ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ, నేను మొద‌ట నాగార్జున హీరోగా నటించిన 'బాస్ ఐ ల‌వ్ యూ' చిత్రం కోసం ఆడిష‌న్స్ కి హాజ‌ర‌య్యాను. అక్క‌డ చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. ఆడిష‌న్స్ ఎలాగో క‌ష్ట‌ప‌డి పూర్తి చేసినా అందులో న‌టించ‌డం ఇష్టం లేక ఆ చిత్ర యూనిట్ కి దొరక్కుండా నా ఫోన్ నెంబ‌ర్ మార్చేసాను. ఆ త‌ర్వాత కొత్తవారితో గ్యాంగ్ స్ట‌ర్ అనే మూవీ ఆడిష‌న్స్ కి వెళ్లాను.
అదే స‌మ‌యంలో పూరీ జ‌గ‌న్నాథ్ మ‌హేష్ పోకిరి కోసం ఆడిష‌న్స్ జ‌రుపుతూ ఉంటే దానికి కూడా హాజ‌ర‌య్యాను. ఒకేసారి గ్యాంగ్ స్ట‌ర్, పోకిరి రెండు చిత్రాల‌లో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. గ్యాంగ్ స్ట‌ర్ కి డేట్స్ ఇచ్చేయ‌డం వ‌ల్ల పోకిరి చిత్రం అవ‌కాశాన్ని వ‌దులుకోవాల్సి వ‌చ్చింది. నేను డేట్స్ ఇచ్చిన సినిమా ఆర్థికపరంగా ఇబ్బందులు ఉండడం వల్ల నేను ఒక్క షాట్ కూడా చేయకుండానే అది ఆగిపోయింది. ఆనాడు ఒక వేళ పోకిరిలో న‌టించి ఉంటే టాలీవుడ్ లో నేను మరింత ఉన్నత స్థానం లో ఉండేదానిని అని చెప్పుకొచ్చింది. నిజ‌మే.. ఎందుకంటే పోకిరి సినిమాయే ఒక సంచ‌ల‌నం.
ఆ సినిమాతో ఐటెం గర్ల్ గా చేసిన ముమయత్ ఖాన్ ఫుల్ బిజీ అయ్యింది. ద‌క్షిణాదిన హీరోలలో నాకు మ‌హేష్ అంటే చాలా ఇష్టం. అవకాశం వస్తే మ‌హేష్ బాబుతో ఖ‌చ్చితంగా ఓ చిత్రం చేస్తాను. మ‌హేష్‌తో క‌లిసి ప‌నిచేయాల‌ని మాత్రం బ‌ల‌మైన కోరిక‌గా ఉంద‌ని కంగ‌నా చెప్పుకొచ్చింది. మరి ఆ కాంబినేషన్ ఏ దర్శకుడు సెట్ చేస్తాడో చూద్దాం.

మనిషి విలువలు పెరిగి మానవత్వం పరిమళిస్తున్న సమయం ఈ కరోనా లాక్ డౌన్ -‌ గోపీచంద్‌

మనిషి విలువలు పెరిగి  మానవత్వం పరిమళిస్తున్న సమయం ఈ కరోనా లాక్ డౌన్ -‌ గోపీచంద్‌

కరోనా సంక్షోభం వలన సినిమా షూటింగు లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ కార్మికులకు తన వంతు సహాయం అందించాడు గోపీచంద్. అంతే కాకుండా తన ఇంటి పరిసరాల్లో వున్నా పేద కుటుంభాలకు నిత్యావసర వస్తువులు, ఆహరం అందించి తన ఉదారతను చాటుకున్నా ఈ మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో ‘యు టర్న్‌’లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా స్విలర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.3గా శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న భారీ చిత్రం ‘సీటీమార్‌’. ఈ ప్రెస్టీజియస్‌ మూవీలో మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. తరుణ్‌ అరోర ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే 50% చిత్రీకరణ పూర్తి చేసుకుని లాక్‌డౌన్‌ వల్ల వాయిదా పడిరది. కరోనా ప్రభావంతో స్టే హోమ్ స్టే సేఫ్ పాటిస్తూ ఈ విరామ సమయం లో ఏం చేస్తున్నారో మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ చెప్పిన ముచ్చట్లివీ...
షూటింగ్‌కి వెళ్లడం లేదే అని మీ వాళ్ళు ఏమైనా అడుగుతున్నారా?
- మా పెద్దబ్బాయి విరాట్‌ అడిగాడు. కరోనా వైరస్‌ వచ్చిందనీ, బయటికి వెళ్లకూడదని, చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పా. తనక్కూడా అర్థమైంది. ఇంట్లోకి ఎవ్వరినీ రానివ్వకూడదు కదా అంటూ, శానిటైజర్‌తో చేతు కడుగుతున్నాడు (నవ్వుతూ). ఆరేళ్లొచ్చాయి కాబట్టి ఏం చెప్పినా వెంటనే అర్థం చేసుకుంటున్నాడు.
కుటుంబంతో గడిపేందుకు ఇదొక మంచి అవకాశం కదా?
- మా పెద్దబ్బాయితో హోమ్‌ వర్క్‌ చేయిస్తున్నా, డ్రాయింగ్‌ వేయిస్తున్నా. బిజిగా తీరిక లేని జీవితంతో ఫామిలీతో గడపలేకపోయిన వాళ్లకి ఈ విరామం గొప్ప అవకాశం. ఇది వరకు నేను పిల్లల్ని చూసుకోవడంలో కష్టం ఏముందిలే అనుకునేవాణ్ని. అసలు విష్యం ఇప్పుడు అర్థమవుతోంది. మా చిన్నబ్బాయి వియాన్‌ ఇప్పుడు పరిగెడుతున్నాడు. ఇద్దరూ ఏదో ఒక వస్తువు కోసం పోటీపడుతుంటారు. వాళ్లని కంట్రోల్‌ చేయడం చాలా పెద్ద పనే.
కరోనా పరిణామాలపై మీకెలాంటి ఆలోచలు వస్తున్నాయి?
- లోకమంతా ఇలా ఒకే విషయంపై ఆగిపోయే రోజులొస్తాయని కలలో కూడా ఊహించలేదు. ప్రపంచానికి ఇదొక సంకేతంలా అనిపిస్తోంది. యంత్రం లా స్పీడ్ గా కొనసాగే లైఫ్ లో ఓయ్ కొంచెం ఆగండి, మీరేం చేస్తున్నారో ఒక్క సారి ఆలోచించండి అని చెప్పినట్టు ఉంది. ఈ కొన్నాళ్లల్లోనే ప్రకృతిలో చాలా మార్పు చూశా. యాభై శాతం కాలుష్యం తగ్గిపోయింది. పక్షులు, జంతువుల స్థానాన్ని మనం ఇంతగా ఆక్రమించేశామా అనిపించింది. మా ఇంటి పక్కన పార్క్‌లో పక్షులు ఉండేవి కాదు. ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటి కిల కిల రవాలతో మనసు ఎంతో ఆహ్లదపరుస్తోంది.
దేవుడు ఇచ్చిన స్వేచ్ఛ వాటికి ఇప్పుడు వచ్చినట్టు అనిపిస్తోంది. కరోనా వల్ల మనలో మార్పు వస్తుంది. ఇకపై మన జీవితాలు మరోలా ఉండబోతున్నాయి అనిపిస్తుంది. ఇప్పుడు డబ్బున్నోడు, లేనోడు ఒక్కటే. ఒకరికొకరు సాయం చేసుకోవాలి, పక్కవాడు బాగుంటే మనం బాగుంటామనే ధోరణిలో మనం ఆలోచిస్తున్నాం. మనిషి విలువ ఇప్పుడు తెలుస్తుంది.
లాక్ డౌన్ తర్వాత సినీ పరిశ్రమలో పరిస్థితులు ఇదివరకటిలా ఉండవేమో కదా? 
- కచ్చితంగా కొన్ని మార్పులైతే వస్తాయి. కరోనాకి వ్యాక్సిన్‌ వచ్చాక గానీ అందరికీ పూర్తిగా ధైర్యం రాదు. అప్పటిదాకా భయంగా భయంగా బతకాల్సిందే. సినిమా అంటే ఎక్కువమంది కలిసి పనిచేయాల్సి ఉంటుంది, సినిమా చూసేది కూడా సమూహంగానే. మనం కష్టపడి చిత్రీకరణ పూర్తి చేసినా థియేటర్‌కి ప్రేక్షకులు రావాలి కదా, వాళ్లు రావాలంటే ముందు భయం తొలిగిపోవాలి. ఇదంతా జరగడానికి సమయం పడుతుంది.
ఈ సమయంలో మీకు ఏమైనా మిస్‌ అయ్యామన్న ఫీలింగ్‌ ఉందా?
` స్నేహితుతో కలిసి గడపడమంటే నాకు చాలా ఇష్టం. అదిప్పుడు బాగా మిస్‌ అవుతున్నా. ఫోన్‌లో టచ్‌లో ఉంటున్నాం. ప్రభాస్‌, నేను అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నాం. కరోనా ప్రభావం మొదలైన సమయంలోనే తను జార్జియా వెళ్లాడు. నేను ‘అక్కడ ఇలా ఉందంట, ఇక్కడిలా ఉందంట.. జాగ్రత్త’ అంటూ మెసేజెస్‌ పంపుతుండేవాణ్ని. ‘ఏం పర్లేదురా, ఇప్పటివరకూ బాగానే ఉంది, మేం కూడా వచ్చేస్తున్నాం’ అని తిరిగి వచ్చేసాడు. తను తిరిగొచ్చాక 14 రోజు స్వీయ క్వారంటైన్‌లోనే ఉన్నాడు’’.
ప్రస్తుతం మీరు చేస్తున్న ‘సీటీమార్‌’ సినిమా ఎంతవరకూ వచ్చింది? 
‘- 'సీటీమార్‌’ సినిమా 50 శాతం పూర్తయింది. ద్వితీయార్ధం మొదలైన సమయంలోనే కరోనాతో బ్రేక్‌ పడిరది. కుటుంబ అనుబంధాతో కూడిన క్రీడా నేపథ్య చిత్రం. నేను, తమన్నా ఇద్దరం కబడ్డీ కోచ్లుగా కనిపిస్తాం. ప్రొ కబడ్డీ చూసి నా పాత్ర కోసం సిద్ధమయ్యా. ఆట గురించి అన్ని విషయాలు తెలుసుకున్న.. అలాగే సంపత్‌ నందితో ఇదివరకే ఒక సినిమా చేశాను. వెరీ టాలెంటైడ్‌ డైరెక్టర్‌. ఈ చిత్రాన్ని కూడా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవ విడుదల చేసిన ఫస్ట్‌ుక్‌కి కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే మా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి గారు ప్రెస్టీజియస్‌గా ఈ మూవీని నిర్మిస్తున్నారు.
మీ సినీ కెరీర్లో ఒక మలుపు తిప్పిన తేజతో సినిమా ఎప్పుడూ?
- తేజతో నేను ఎప్పుడో సినిమా చేయాలి. ఆయన ఈమధ్యే ‘అలివేలు మంగ వేంకటరమణ’ అనే కథ చెప్పారు. అది చాలా నచ్చింది. ఆమధ్య రజనీకాంత్‌ సినిమాలో నటిస్తున్నావట కదా అని కొంతమంది తమిళ స్నేహితు ఫోన్‌ చేసి అడిగారు. నిజం కాదని చెప్పా. రజనీతో సినిమా చేస్తున్న దర్శకుడు శివ, నేను కలిసి రెండు సినిమాలు చేశాం. శివ, నేను అప్పుడప్పుడు మాట్లాడుకుంటుంటాం. మీరెప్పుడు చెబితే అప్పుడు సినిమా చేస్తాను సర్‌ అంటుంటాడు. ‘నువ్వు తమిళంలో బాగా చేస్తున్నావు కదా, పెద్ద హీరోతో చేయడం నీకు మంచిది. మనం తర్వాత చూసుకుందాం’ అని చెబుతుంటా’.