Wednesday, September 2, 2020

Chennai Super Kings bring on board Levista Coffee as Official Licensed Coffee Partners

 

Chennai Super Kings bring on board Levista Coffee as Official Licensed Coffee Partners

In a first of its kind partnership, one of South India’s most preferred and favorite coffee brand, Levista Instant Coffee is on-board as ‘Official Licensed Coffee Partner’ for Chennai Super Kings this season of Dream11 IPL 2020. In a distinctive brand partnership with Chennai Super Kings (CSK), one of the revered teams in IPL, it also marks a distinctive milestone for a coffee brand to associate with the annual sporting extravaganza. Through this association, the brand will launch a special season/ limited edition package in its instant coffee range as well as other collector’s worth combo packs with special Thala MS Dhoni and CSK team keepsakes, a coveted range for both coffee and cricket fans.

The special CSK packaging and Levista “Special CSK combo packs” will be available from 10th September 2020 at over 34,000 general trade stores, in India as well as in modern retail formats through Reliance Retail, More Supermarkets, SPAR, Metro Cash & Carry among others. The range will also retail online at Amazon, Big Basket, Flipkart, and Udaan to ensure the special collector worthy packs are available to all in India and Internationally. Fans will also have the opportunity to place direct orders through Levista Coffee’s Facebook, Instagram, LinkedIn, and Twitter pages. To ensure a memorable consumer experience the brand will formulate daily game highlights, fun trivia, and contests that will take the love for Coffee, CSK and Cricket to the next level across their digital platforms.

As the gameplay shifts to UAE this season, the championship is expected to garner a lot of enthusiasm and interest among fans and followers of the game. There is anticipation and excitement from viewers and participants of IPL to see the players back in action after the ongoing series being plagued with a delay due to the unprecedented Covid-19 crisis worldwide.

Speaking on the association, Mr. S. Shriram, Vice President, Levista Coffee said, “We at Levista are ecstatic to announce our partnership with team CSK as their ‘Official Licensed Coffee Partner’ this season of Dream11 IPL 2020. Cricket and Coffee are desires that satisfy both the mind and body. It awakens and brings to fore creativity with renewed energy. The quality and flavor of Levista Instant coffee resonates with the vivacity and passion of all CSK and cricket fans. We look forward to delighting our consumers and CSK loyalists, one cup at a time. Brand Levista is honored to be part of this association which will also aid in relief fund contributions to the PM CARES Fund program through the sale of CSK combo packs. We look forward to driving support for team CSK with each cup of coffee and look forward to a successful ‘CUP’ winning for the team at Dream11 IPL 2020.”

Commenting on the partnership, Mr. KS Viswanathan, Chief Executive Officer, Chennai Super Kings, said: “CSK are happy to welcome Levista on board as official Licensed Coffee Partner. Coffee and cricket conversations go hand in hand, and this IPL season Levista promises to enhance this experience for cricket fans with a special edition across their range of products.”

Levista Coffee from the house of SLN Coffee was launched in 2017 with the vision to provide its consumers with the best taste and freshest offerings in an instant format. The brand that believes in fresh, rich experiences has joined team CSK to propel its support. With offerings across instant, filter, and artisanal range of coffees, the brand pours the best quality brews made from handpicked beans. Levista offers Instant and Filter Coffee Powder in three variants and a dozen pack sizes.

7 నుంచి హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభం

 Hyderabad Metro rail to resume ops in phases from September 7


తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 7వ తేదీ నుంచి మెట్రో రైళ్లు మళ్లీ పరుగు పెట్టనున్నాయి. 21వ తేదీ నుంచి పెండ్లిళ్లు, అంత్యక్రియలను 100 మందితో నిర్వహించుకోవచ్చు. 30వ తేదీ వరకు కంటైన్మెంట్‍ జోన్లు కొనసాగుతాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్‍లాక్‍-4 ఉత్తర్వులను అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‍కుమార్‍ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు, కోచింగ్‍  సెంటర్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్‍పూల్స్, ఎంటర్‍టైన్మెంట్‍ పార్కులు, థియేటర్లు ఇలాంటి ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 7వ తేదీ నుంచి మెట్రో రైల్‍ నిర్వహణకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. కంటైన్మెంట్‍ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్‍ ప్రొసీజర్స్ (ఎస్వోపీ) పాటిస్తూ లాక్‍డౌన్‍కు ముందు ఉన్న అన్ని కార్యక్రమాలకు అనుమతిస్తున్నట్టు పేర్కొన్నది.

మార్గదర్శకాలు ఇవీ...

ఆన్‍లైన్‍ క్లాసులు, దూరవిద్యకు అనుమతి. ప్రోత్సాహం. 21 నుంచి ఆన్‍లైన్‍ టీచింగ్‍, టెలీకౌన్సెలింగ్‍, దీనికి సంబంధించిన పనులకు విద్యాసంస్థలకు ఒకే సమయంలో 50 శాతం టీచింగ్‍ నాన్‍ టీచింగ్‍ స్టాఫ్‍కు అనుమతి. 21 నుంచి ఐటీఐలు, స్కిల్‍ డెవలప్‍మెంట్‍ శిక్షణకు, ఉన్నత విద్యాసంస్థల్లో పీహెచ్‍డీ, పీజీ టెక్నికల్‍ పోగ్రాంలకు అనుమతి. ఈ నెల 21 నుంచి సోషల్‍, అకడమిక్‍, స్పోర్టస్, ఎంటర్‍టైన్మెంట్‍ కల్చరల్‍, రిలీజియస్‍, రాజకీయ సమావేశాలతో పాటు ఇతర జనసమూహ కార్యక్రమాలను వందమందికి మించకూండా నిర్వహించుకోవచ్చు. ప్రస్తుతానికి బార్లు, క్లబ్‍లు బంద్‍. వీటిని ప్రారంభించడానికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తారు.

గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహాగణపతి

 

Khairatabad Ganesh visarjan 2020

ధన్వంతరి నారాయణ మహాగణపతిగా పూజలందుకున్న ఖైరతాబాద్‍ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఎన్టీఆర్‍ మార్గ్ వద్ద ఏర్పాటు చేసిన నాలుగో నవంబర్‍ క్రేన్‍ వద్ద మహాగణపతి నిమజ్జనం విజయవంతంగా పూర్తయింది. కరోనా కారణంగా ఈసారి కేవలం 9 అడుగుల మట్టి విగ్రహాన్ని ఖైరతాబాద్‍ ఉత్సవ నిర్వాహకులు రూపొందించారు. మహాగణపతి నిమ్జనాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నిమజ్జనం కంటే ముందు గణేష్‍ ఉత్సవ సమితి నిర్వాహకులు గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకను చూసిన భక్తులు తన్మయత్వం చెందారు. జై జై గణేశా నినాదాలతో ట్యాంక్‍ బండ్‍, ఎన్టీఆర్‍ మార్గ్ పరిసరాలు మార్మోగిపోయాయి.

మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఖైరతాబాద్‍ మహాగణపతి శోభయాత్ర.. భక్తుల సందడి మధ్య ఐదారు గంటల పాటు శోభాయమానంగా సాగింది. కరోనా వైరస్‍ సంక్రమణ క్రమంలో గణేశ్‍ నవరాత్రి ఉత్సవాలు నిరాడంబరంగా సాగాయి. వైరస్‍ ప్రభావంతో ఉత్సవాల శోభ కాస్త తగ్గినా.. విగ్రహాల సంఖ్య మాత్రం తగ్గలేదు. ప్రతి ఇంటిలో ప్రతిష్టించిన చిన్న చిన్న గణనాథుల నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగింది. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీటీవీ కెమెరాలతో కంట్రోల్‍ రూం నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

తొలిసారి బాలాపూర్ లడ్డూ వేలంపాట రద్దు

 

Balapur laddu 2020 auction cancelled

బాలాపూర్‍ లడ్డూ వేలం పక్రియ ఈ దఫా రద్దైంది. గణేష్‍ ఉత్సవ కమిటీ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది లడ్డూ వేలంపాటను రద్దు చేసినట్టు ప్రకటించింది. బాలాపూర్‍లో ఈ దఫా వేలం పాట లేకుండానే గణేష్‍ శోభయాత్ర ప్రారంభమైంది. ప్రత్యేక పూజల తరువాత మండపం నుంచి బాలాపూర్‍ గణపయ్య బయలుదేరారు. ఈ కార్యక్రమం గురించి ఎప్పుడు, ఎక్కడ చర్చకు వచ్చినా, అందరి దృష్టి లడ్డూ ధర పైనే ఉంటుంది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో బాలాపూర్‍ గణేష్‍ ఉత్సవ కమిటీ లడ్డూ వేలం పక్రియను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ వేలంపాటను ఈ ఏడాది రద్దు చేసినట్టు తెలిపింది.

బాలాపూర్‍ గణేష్‍ వేలంపాట 1994లో మొదలుకాగా, లడ్డూ వేలం పక్రియను నిలిపివేయడం ఇదే తొలిసారి. కాగా, 1994లో తొలి ఏడాది రూ.450కు బాలాపూర్‍ గణపయ్య లడ్డూను కొలను మోహన్‍ రెడ్డి సొంతం చేసుకోగా, గతేడాది (2019లో) కొలను రాంరెడ్డి అనే భక్తుడు రూ.17.60 లక్షల రకార్డు ధరకు బాలాపూర్‍ లడ్డూను వేలంలో సొంతం చేసుకోవడం తెలిసిందే.

ముగిసిన ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు

 Former President Pranab Mukherjee Funeral


మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్‍ ముఖర్జీ అంతిమ యాత్ర ముగిసింది. లోధి స్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. సైనిక లాంఛనాలతో ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు. ప్రణబ్‍ అంత్యక్రియలను ఆయన కుమారుడు అభిజిత్‍ ముఖర్జీ నిర్వహించారు. కరోనా ప్రోటోకాల్‍ ప్రకారం పరిమిత సంఖ్యలో జనాభాను అనుమతించారు. అంతకు ముందే రాష్ట్రపతి రామ్‍నాథ్‍ కోవింద్‍, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆశ్రునయనల మధ్య ఆయనకు వీడ్కోలు పలికారు. కరోనాతో పోరాడి ప్రణబ్‍ ముఖర్జీ తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

అన్‍లాక్‍ 4 మార్గదర్శకాలు నేటి నుంచి అమలు

 

Unlock 4 Full guidelines issued by different states

అన్‍లాక్‍ 4 నిబంధనలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. సెప్టెంబర్‍ 30వ తేదీ వరకు అన్‍లాన్‍ 4 నియామావళిని పాటించాల్సి ఉంటుంది. కేంద్ర హోంశాఖ ఆన్‍లాక్‍ 4 మార్గదర్శకాలను రిలీజ్‍ చేసిన విషయం తెలిసిందే. కొత్త మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్‍ 7వ తేదీ నుంచి మెట్రో సర్వీసులను దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నారు. స్కూళ్లు, కాలేజీలు మాత్రం బంద్‍ చేసి ఉంటాయి. మతపరమైన, రాజకీయ, సామాజిక, క్రీడా సమావేశాలకు వందకు మించి జనం హాజరుకావద్దు అంటూ అనుమతి ఇచ్చింది. అయితే సెప్టెంబర్‍ 21వ తేదీ నుంచి ఈ నిబంధన వర్తిస్తుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులు ఈ నెల చివర వరకు నిలిపివేశారు. కేవలం అనుమతి ఉన్న విమనాలకే ప్రయాణం ఉంటుంది. అంతర్‍ జిల్లా, అంతర్‍ రాష్ట్ర ప్రయాణాలకు అనుమతి అవసరం లేదు. కంటోన్మెంట్‍ కాని ప్రాంతాల్లో లాక్‍డౌన్‍ అమలు చేయకూడదని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం జారీ చేసింది.

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్‌ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘వ‌కీల్ సాబ్’ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల

 

vakheel saab motion poster released

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌కుడు. ప‌వ‌న్‌కళ్యాణ్ పుట్టిన‌రోజు(సెప్టెంబ‌ర్ 2) సంద‌ర్భంగా ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఒక వైపు మ‌హాత్మాగాంధీ ఫొటో, మ‌రో వైపు అంబేద్క‌ర్ ఫొటో మ‌ధ్య ప‌వ‌న్ లాయ‌ర్ కోటు వేసుకుని నిల‌బడ్డారు. ఓ చేతిలో బేస్‌బాల్ స్టిక్‌, మ‌రో చేతిలో క్రిమిన‌ల్ లా అనే పుస్త‌కం ప‌ట్టుకుని ప‌వ‌న్ ఠీవిగా నిల‌బ‌డి ఉన్నలుక్‌తో ఉండేలా మోష‌న్ పోస్ట‌ర్ ప్రేక్ష‌కాభిమానుల అంచ‌నాల‌ను మించేలా ఉంది. ఈ మోష‌న్ పోస్ట‌ర్ బ్యాగ్రౌండ్‌లో స‌త్య‌మేవ జ‌య‌తే ... అనే బీట్ వినిపిస్తుంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ ‘‘పవర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్‌గారి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌డం హ్యాపీగా ఉంది. ఆయ‌న అభిమానులు, సినీ ప్రేక్ష‌కులు కోరుకునేలా ఓ ప‌వ‌ర్‌ఫుల్ లాయ‌ర్ పాత్ర‌లో ప‌వ‌న్‌కళ్యాణ్ గారు క‌నిపించ‌బోతున్నారు. క‌రోనా వైర‌స్ ప‌రిస్థితులు కాస్త చ‌క్క‌బ‌డ్డ త‌ర్వాత మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేసి సినిమాను వీలైనంత త్వ‌ర‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ: పి.ఎస్‌.వినోద్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: రాజీవ‌న్‌, ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి, డైలాగ్స్‌: తిరు, యాక్ష‌న్ ర‌వివ‌ర్మ‌, వి.ఎఫ్‌.ఎక్స్‌: యుగంధ‌ర్‌, కో ప్రొడ్యూస‌ర్‌: హ‌ర్షిత్ రెడ్డి, స‌మ‌ర్ప‌ణ‌: బోనీ క‌పూర్‌, నిర్మాత‌లు: దిల్‌రాజు, శిరీష్ , ద‌ర్శ‌క‌త్వం: శ్రీరామ్ వేణు.

https://youtu.be/1rcJgndYjN8

భారతీయులు బుద్ధిష్ట్ ల పాలిట విల్లన్ లా? పూరీ జగన్నాథ్ కి ఏమైంది?

 

BUDDHISM Puri Musings by Puri Jagannadh

"ఏ తప్పు చేయని బుద్ధిష్ట్‌లను దారుణంగా చంపేశాం మనం.. వాళ్లు ఒకరికి హాని చేయరు.. కనీసం పల్లెత్తు మాట కూడా మాట్లాడరు అలాంటి వాళ్లను కర్రలతో కొట్టి చంపేశాం." ఇవి పూరి ఆరోపణలు
లాక్ డౌన్‌లో షూటింగ్ పనిని పక్కనపెట్టి.. తనకు మెదడుకు పదును పెట్టిన డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వివిధ అంశాలపై తన మార్క్ డైలాగ్‌లతో వరుస ఆడియో టేప్‌లను విడుదల చేస్తున్నారు. కులం, మతం, లవ్, ఎమోషన్స్ లాంటి బర్నింగ్ ఇష్యూస్‌పై తన స్పందనలను తెలియజేస్తున్న పూరీ జగన్నాథ్ తన యూట్యూబ్ ఛానల్‌లో బుద్ధిజంపై సంచలన కామెంట్స్ చేశారు. సిద్దార్థ్ గౌతమ్ లుంబినీలో 623 కాలంలో పుట్టాడు. ఆ తరువాత ఆయనే బుద్దుడు అయ్యాడు. ఆయనతోనే బుద్దిజం మొదలైంది. బుద్ధిజం అనేది హిందు, క్రిస్టియన్ మాతాలకంటే పురాతనమైనది. బుద్దుడు ఏం చెప్పాడంటే.. ఏ దేవుడు లేడు.. మన కోసం ఎవడూ రాడు.. ప్రతిఒక్కడు బుద్దుడే. అది మనకు నచ్చలేదు. అందరికీ కోపం వచ్చింది. అందుకే బుద్ధిష్ట్‌లను నిర్ధాక్షిష్యంగా చంపేశారు. పాపం వాళ్లు ఎవ్వరితోనూ గొడవపడరు. పల్లెత్తు మాట అనను.. జీవ హింస చేయరు. ఎప్పుడూ మెడిటేషన్‌లో ఉంటారు. కర్మని, పునర్జన్మని నమ్ముతారు. అలాంటి వాళ్లని కర్రలతో కొట్టి చంపేశాం. దేశం వదిలిపారిపోయేలా చేశాం. ఈ గొడవల్లో ఆత్మ రక్షణ కోసం బుద్ధిష్ట్‌లు కనుగొన్నదే కరాటే. చేతులే ఆయుధాలుగా చేసుకుని తమని తాము కాపాడుకోవడానికి దీన్ని కనిపెట్టారు. కరాటే అంటే ఖాళీ చేతులు అని అర్థం. సెల్ఫ్ డిఫెన్స్ ఆర్ట్ అది. చనిపోగా మిగిలిన బుద్ధిష్ట్‌లు టిబెట్, థాయ్ లాండ్, చైనా పారిపోయారు. అలా బుద్దుడు వేరే దేశాలకు దేవుడైపోయాడు.

ప్రపంచం అంతా బూడా బూడా అని మొక్కుతుంటారు. బుద్దిజమ్ వరల్డ్‌లోనే నాలుగో అతిపెద్ద మతం. ఒక చైనాలోనే 250 మిలియన్ల మంది ఉన్నారు. థాయ్ లాండ్, కంబోడియాలో 90 శాతం బుద్ధిష్ట్ పాపులేషన్ ఉంది. 1963 వియత్నాలో అక్కడున్న ప్రభుత్వం బుద్ధిష్ట్‌లను ఇబ్బంది పెడుతుంటే.. ఒక బుద్ధిష్ట్ మాంక్ దానికి నిరసనగా.. అందరూ చూస్తుండగా.. పెట్రోల్ పోసుకుని తనను తాను తగలబెట్టుకున్నాడు. మంటల్లో తగబడిపోతున్నా అతను అరవలేదు.. కదల్లేదు.. కనీసం అతని నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. కూర్చున్న చోటా మౌనంగా కాలిపోయాడు. నా కోసం ఒక్కసారి ఆ వీడియో చూడండి. అలా కాలిపోయి చనిపోవడానికి ఎంత విల్ పవర్ ఉండాలో చూడండి. యుద్ధం చేస్తూ చనిపోతే వీరమరణం అంటారు.. యద్దం చేయకుండానే వీరమరణం పొందాడు అతను. యుద్దం చేయలేక కాదు.. యుద్దం వద్దనుకున్నాడు. దటీజ్ పవర్ ఆఫ్ బుద్ధిజం. లామా అంటే టీచర్ ఆఫ్ ధర్మ అని అర్థం.. ఒక లామా చనిపోతూ తను మళ్లీ ఎక్కడ పుట్టబోతున్నాడో చెప్పి మరీ చనిపోతాడు. 

ఆ తరువాత మాంగ్స్ అందరూ కలిసి ఆ పుట్టబోయే బిడ్డకోసం వెతకుతారు. ఆ పిల్లాడిని లామా చేస్తారు. ఇప్పుడున్న దలైలామాని గుర్తించడానికి వాళ్లకి నాలుగేళ్లు పట్టింది. మనం బుద్ధుడ్ని వాడం.. ఓన్లీ బుద్ధుడి బొమ్మల్ని వాడతాం. మసాజ్ సెంటర్లు, పార్లర్‌లు హాల్‌లో టీవీ పక్కన బుడ్డ బుడ్డ లాఫింగ్ బుద్ద బొమ్మల్ని పెట్టుకుంటాం.. ఎందుకు అంటే పీస్ కోసం అంటామ్.. ఎందుకంటే మనకి సిగ్గు లజ్జా ఉండదు మనకి. ఏ పాపం తెలియని బుద్ధిష్టుల తలలు నరికిన దేశం మనది. పీస్ గురించి మాట్లాడొచ్చా? తప్పుకదా.. ఇప్పటి వరకూ ఏ బుద్ధిష్ట్ ఎవర్నీ చంపలేదు. వాళ్లు తలచుకుంటే.. ఒక్కో మాంక్ ఒట్టిచేతులతో వంద మందిని చంపగలడు. కాని ఎప్పుడూ అలా చేయలేదు. కాని మనం ఎంతో మంది బుద్దుల్ని చంపేశాం. ఒకరికి హాని చేయని మౌనంగా ఉన్న మునిలను కూడా వదలం మనం.. తలలు నరకుతాం. మతం మత్తులో ఉన్న శాడిష్టులం మనం. బుద్ధిష్టులు ఎలాగూ తిట్టరు.. తప్పుడు మాట వాళ్ల నోటిలోనుంచి రాదు.. 2000 సంవత్సరాల తరువాత కనీసం నన్నైనా మనస్పూర్తిగా తిట్టనీయండి’ అంటూ పచ్చి బూతుతో ముగించారు పూరీ జగన్నాథ్.

https://youtu.be/a1FyVe3taw4

కొనోషాలో మితవాత హింసను సమర్థించిన ట్రంప్

 

Trump to visit Kenosha despite objections of local officials

గతవారం కొనోషాలో పోలీసుల హింసకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న ఇద్దరు వ్యక్తులను మితవాత గన్‍మెన్‍ కాల్చిచంపడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ సమర్థించుకున్నారు. స్వీయ రక్షణ కోసమే అతను కాల్పులు జరిపాడని ట్రంప్‍ ఉద్ఘాటించారు. నిరసనకారుల నుంచి తప్పించుకోవడానికి అతను పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతను పడిపోయాడు. వారందరూ అతనిపై హింసాత్మకంగా దాడి చేయబోయారు అని ట్రంప్‍ చెప్పారు. అతను పెద్ద ఆపదలో ఉన్నాడని నేను ఊహిస్తున్నాను. అతను ఖచ్చితంగా హత్యకు గురికాబడి ఉండేవాడు అని ట్రంప్‍ అసత్యాలు పలికారు.

గత మంగళవారం ప్రశాంతంగా నిర్వహిస్తున్న నిరసనలపై 17 ఏండ్ల కైలీ రిటెన్‍హౌస్‍ చేసిన కాల్పుల్లో ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే. ఈ కాల్పులు చేసిన తరువాత తుపాకితీతో సహా పోలీస్‍ లైన్ల ద్వారా వెళ్లడానికి రిటెన్‍హౌస్‍ను అనుమతించారు. అరెస్టు కనీసం ప్రశ్నించడానికి కూడా అతన్ని ఆపలేదు. తరువాత ఇల్లినాయిస్లోని తన నివాసంలో రిటెన్‍హౌస్‍ను అరెస్టు చేశారు.

అమెరికాలో హింసాత్మకంగా మారిన నిరసనలు

 

Protests continue over Jacob Blake shooting

నల్లజాతీయుడు జాక్‍బో బ్లేక్‍పై పోలీసుల కాల్పులకు నిరసనగా అమెరికాలో జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. బ్లేక్‍పై కాల్పులకు నిరసనగా పోర్ట్ లాండ్‍లో ప్రజలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో ట్రంప్‍ మద్దతుదారులు ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తూ అటు వైపు రావడంతో ఒక్కసారిగా ఉద్రికత్త ఏర్పడింది. పర్యవసానంగా ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన ట్రంప్‍ మద్దతు దారుడు ఒకరు మరణించారు. మరో వైపు ఆందోళనల్లో మరణించిన వ్యక్తి తన మద్దతుదారుడని తెలిపిన అధ్యక్షుడు ట్రంప్‍ డెమొక్రటిక్‍ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ పార్టీకి చెందిన పోర్ట్లాండ్‍ మేయర్‍ డెటా వీలర్‍పై విరుచుకుపడ్డారు.

జో బైడెన్‍, టెడ్‍ వీలర్‍ ఇద్దరూ దొందూ దొందేనని విమర్శించారు. శాంతి భద్రతల్ని కాపాడడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. అవసరం అనుకుంటే బలగాల్ని రంగంలోకి దించుతామని హెచ్చరించారు. ట్రంప్‍ వ్యాఖ్యలపై డెమొక్రటిక్‍ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‍ కూడా దీటుగా స్పందించారు. ట్రపే హింసను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న వారిపై వాహన శ్రేణితో దూసుకువెళ్లడమే కాక, వారిని దేశభక్తులుగా అభివర్ణిస్తారా అని మండిపడ్డారు.

మాస్క్ తో 2 లక్షల మరణాలకు చెక్

 

Mask Use and Social Distancing May Prevent 2 Lakh Covid 19 Deaths

ప్రజలు ఆరోగ్యస్పృహతో మాస్క్లు వాడి, భౌతికదూరాన్ని తు.చ తప్పకుండా పాటిస్తే డిసెంబరుకల్లా భారత్‍కు 2 లక్షల కరోనా మరణాల గండం తప్పుతుందని అమెరికాలోని వాషింగ్టన్‍ వర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. దేశ జనాభాలో సింహబాగం ప్రజలు ఇంకా ఇన్ఫెక్షన్‍ గండానికి చేరువలోనే ఉన్నారని హెచ్చరించింది. డిసెంబరు మొదటివారం నుంచి మూడోవారం కల్లా భారత్‍లో కరోనా కేసులు పతాక స్థాయికి చేరొచ్చని అంచనా వేసింది. ఇన్ఫెక్షన్లు ఇదే రీతిలో పెరుగుతూపోతే. ఆ సమయానికి ప్రతిరోజు 60 లక్షల కేసులు నమోదయ్యే అవకాశాలు ఉండగా, అప్పటికి మొత్తం మరణాల సంఖ్య 5 లక్షలకు చేరొచ్చని పేర్కొంది. ఒక వేళ పరిస్థితులు అదుపులోకి వచ్చి, ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడితే.. డిసెంబరు 1 కల్లా మరణాలు 2.91 లక్షలకే పరిమితం కావచ్చని ప్రస్తావించింది. కేసులు, మరణాలపై గతంలో వచ్చిన నివేదికల గణాంకాలతో పోలిస్తే, ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయని హరియాణాలోని అశోకా వర్సిటీ ప్రొఫెసర్‍ గౌతమ్‍ మీనన్‍ అభిప్రాయపడ్డారు.

కొవిడ్ ఫలితం చెప్పే.. ల్యాంప్ పరికరం!

 

LAMP Lights Up COVID 19 Testing

ఎలాంటి ప్రయోగశాలతో పనిలేకుండా, ఉన్న చోటే కొవిడ్‍-19 పరీక్ష నిర్వహించి, ఫలితాన్ని తెలుసుకునే సరికొత్త పరికరాన్ని అమెరికా పరిశోధకులు రూపొందించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలాచోట్ల కొవిడ్‍ పరీక్ష ఫలితం కోసం బాధితులు రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. చాలా ప్రయోగశాలల్లో సిబ్బంది కొరత కూడా ఉంటోంది. దీన్ని అధిగమించేందుకు తాము సులభంగా వినియోగించుకోదగ్గ పరికరాన్ని రూపొందించామని.. పరిశోధనలో పాల్గొన్న భారత సంతతి శాస్త్రవేత్త రషీద్‍ బషీర్‍ చెప్పారు. కొవిడ్‍ పరీక్ష నిమిత్తం వ్యక్తుల నుంచి స్వాబ్‍ సేకరించి, ఆర్టీ-పీసీఆర్‍ పక్రియ నిర్వహిస్తున్నారు. ఈ విధానంలో వైరస్‍ ఆర్‍ఎన్‍ఏను రకరకాల ఉష్ణోగ్రతల వద్ద పరీక్షించాల్సి ఉంటుంది. ఇందుకు ప్రత్యేక పరికరాలు, నిపుణులు అవసరం. అయితే, మేము రూపొందించిన ల్యాంప్‍ పక్రియ ద్వారా ఒకేసారి 65 సెంటీగ్రేడ్‍ ఉష్ణోగ్రత వద్ద వైరస్‍ను పరీక్షించి, ఫలితమేంటన్నది తెలుసుకోవచ్చు. క్యాటరిడ్జ్లా ఉండే పరికరంలో ఓవైపు నమూనాను, మరోవైపు ల్యాంప్‍ కెమికల్‍ను ఉంచుతాం. తర్వాత దాన్ని చేత్తో పట్టుకోదగ్గ హీటింగ్‍ ఛాంబర్‍లో వేడి చేస్తాం. పాజిటివ్‍ ఫలితం ఉంటే అరగంటలో ఫ్లోరోసెంట్‍ లైటు వెలుగుతుంది అని పరిశోధకులు వివరించారు.