Sunday, September 6, 2020

కొలంబస్ నగరంలో పీ.వీ. నరసింహారావు శతజయంతి ఉత్సవాలు

 

pv centenary celebrations in columbus

తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన స్వర్గీయ మాజీ ప్రధాని పీ.వీ. నరసింహారావు గారి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఖండాంతరాల్లో మొట్టమొదటి కార్యక్రమం అమెరికాలోని ఒహయో రాష్ట్రంలో గల కొలంబస్ నగరంలో ఎన్నారై టి.ఆర్.స్ ఛైర్మెన్ తన్నీరు మహేష్ రావు గారి ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా పీవీ శత జయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు కే.కేశవరావు గారు, పీవీ కూతుర్లు సురభి వాణి దేవి గారు, కలకోట సర్వసతి గారు, ఉత్సవ కమిటి సభ్యులు మహేష్ బిగాల గారు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు వారితో పాటు ఇతర రాష్ట్రాల ప్రవాస భారతీయులు, పీవీ అభిమానులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కోవిద్ పరిమితుల దృష్ట్యా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమెరికాలో లోని వివిధ రాష్ట్రాల నుండి పీవీ అభిమానులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని టీవీ ఆసియ తెలుగు వారు ప్రత్యక్ష ప్రసారం చేసారు.

కేశవ రావు గారు మాట్లాడుతూ జ్ఞ్యాన సమున్నత, విధాన నిర్ణయాలు, రాజనీతి, సాహితి సాంస్కృతిక, పరిపాలన, ఆధ్యాత్మికత విషయాల్లో  పీవీ గారు ఆయనకు ఆయనే సాటి అని, ఆర్ధిక సంస్కరణలతో ఆధునిక భారతాన్ని ఆవిష్కరించిన దూరాదృష్టి గల నాయకుడని అన్నారు. ప్రధాన మంత్రిగా మరియు వివిధ మంత్రిత్వ  హోదాల్లో  పీవీ గారు భారత దేశానికి  చేసిన సేవలను గుర్తుచేస్తూ వారికి భారత రత్న ప్రదానం చేయడమే సరైన గౌరవ మని, భారత రత్న పురస్కారం గురించి పార్లమెంట్ లో నివేదిస్తామన్నారు. భారత దేశంలో మొట్టమొదటి సారి భూసంస్కరణలు తీసుకువచ్చి దున్నేవాడికే కాకుండా భూమి లేని వాడికి కూడా భూమి ఉండాలని 1971 లో ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తీసుకువచ్చి స్వతంత్ర భారతదేశంలో ఆదర్శవంతునిగా నిలిచారని చెప్పారు. శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఏడాది పాటు ప్రపంచ వ్యాప్తంగా కార్యక్రమాలు, స్మృతి మందిర నిర్మాణం, పీవీ స్వగ్రామమైన వంగరలో స్మారక చిహ్నం, అంతర్జాతీయ స్థాయిలో ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు.

పీవీ నరసింహ రావు గారి వ్యక్తిత్వము మరియు వారి యొక్క భావవ్యక్తీకరణ విధానం గూర్చి వారి కూతురు డాక్టర్ సరస్వతి గారి మాటలలోనే   "చేతలు మరియు నడవడి ద్వార ఎదుటి వారిపై చెదరని ముద్ర వేసే వారు ఇంకా మనము ఏదైనా కార్యసాధన చేసేటప్పుడు ఆ పనిలో మనస్ఫూర్తిగా నిమగ్నమైనప్పుడే ఆ పని విజయవంతం చేయగలము అని చెప్పే వారు. అది నా వ్యక్తిత్వము మరియు నడవడిలో చెరగని ముద్ర వేసినాయి". పీవీ గారు అతి సామాన్యంగా ఉండడానికి ఇష్టపడేవారు, ప్రకృతితో పాటు దేశాన్ని కూడా ఆరాధించేవారు మరియు నిత్యం యోగ సాధన చేసేవారని వారి కూతురు సురభి వాని దేవి గారు అన్నారు.

తన్నీరు మహేష్ గారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గారి సూచనల మేరకు పీవీ శతజయంతి ఉత్సవాలను అమెరికాలోని ముఖ్య నగరాల్లో  నిర్వహించడానికి అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని వివిధ సంఘాల సమన్వయంతో ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీ.సీ మరియు ఇతర నగరాల్లో పీవీ విగ్రహావిష్కరణ, పీవీ బహుముఖప్రజ్ఞకు అద్దంపట్టేలా, ఔన్నత్యం దశ దిశలా  చాటే విదంగా జాతీయ స్థాయి సదస్సులు, కార్యక్రమాలు ఏడాది పాటు ప్రతినెలా నిర్వహిస్తామన్నారు. 1994 పీవీ గారి అమెరికా పర్యటన గుర్తుచేస్తూ.. ఆ సందర్బంగా అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌తో సమావేశం లో తలెత్తే ప్రశ్నలను పీవీ గారు ముందుగా అంచనా వేసి వివరించడంతో..  క్లింటన్ భారత దేశంలో పెట్టుబడులు, ఆర్ధిక విధానాలపై మరింత ఆసక్తి చూపి భేటీ నిర్ణీత సమయం కన్నా మరో ఇరవై నిమిషాలు కొనసాగించి మన దేశానికి పెట్టుబడులను అందించారని అన్నారు.

పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, తెరాస ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల గారు మాట్లాడుతూ సీఎం కెసిఆర్ సూచన మేరకు ఏడాది పాటు ప్రపంచవ్యాప్తంగా యాబై దేశాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ అమెరికా, బ్రిటన్, దక్షిణ ఆఫ్రికా, సింగపూర్, మలేషియా మరియు మారిషెస్ దేశాల్లో పీవీ గారి విగ్రహాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీ.సీ ఇంకా ముఖ్య నగరాల్లో విగ్రహ ఏర్పాట్లకు ప్రణాళిక రూపాందించామన్నారు. వచ్చే ఏడాది హైదెరాబాద్లో నిర్వహించే పీవీ శతజయంతి వేడుకలకు అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్ను ముఖ్య అతిధిగా ఆహ్వానించేందుకు ఆలోచిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమ ఏర్పాటుకు ముందుండి అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నారై టి.ఆర్.స్ రీజినల్ కోఆర్డినేటర్ కానుగంటి నవీన్ గారిని పలువురు అభినందించారు.  ఈ సమావేశంలో ప్రముఖ ప్రవాస భారతీయులు నీల్ పటేల్, కొలంబస్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రవణ్ చిద్రూప, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఛైర్మెన్ రామకృష్ణ కాసర్ల, అధ్యక్షుడు రజినీకాంత్ కట్టే, ఎన్నారై టి.ఆర్.స్ కార్యదర్శి నరసింహ నాగులవంచా సెంట్రల్ ఒహియో తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ చలసాని, ఎస్.వి టెంపుల్ ట్రస్టీ కేశవ రెడ్డి, అశోక్ ఇల్లందుల, అమర్ రెడ్డి, రమేష్, సాలందరి, కిరణ్, డేవిడ్, గోవర్ధన్, వంశీ, కే.కిరణ్, వినయ్, మధు తదితరులు పాల్గొన్నారు.

ఫిట్‌నెస్ ట్రైనర్ కి 20 లక్షల రేంజ్ రోవర్ కార్ గిఫ్ట్.... అదీ ప్రభాస్ రేంజ్

 Prabhas Gifts Gym Trainer Laxman Range Rover


రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఎలా ఉంటుందో చెబుతూ తన ఫిట్‌నెస్ ట్రైనర్ కోసం 20 లక్షల రేంజ్ రోవర్ కార్ గిఫ్ట్ ఇచ్చారు ప్రభాస్. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రభాస్.. ఎంతైనా వరల్డ్ క్రేజీ స్టార్ కదా! అందుకే ఆయన ఏ పని చేసినా ఆ రేంజ్ వేరేలా ఉంటుంది. సినిమాల్లో అయినా నిజ జీవితంలో అయినా ఈ బాహుబలి సత్తానే వేరులే. ఇక తాను ఇష్టపడుతున్న వాళ్ల కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ క్రమంలోనే తాజాగా తనకిష్టమైన తన ఫిట్‌నెస్ ట్రైనర్‌కి ఖరీదైన సర్‌ప్రైజింగ్ ఇచ్చి అతన్ని, అతని కుటుంబాన్ని ఆనందంలో ముంచెత్తాడు ప్రభాస్.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫిట్‌నెస్ ట్రైనర్‌‌గా లక్ష్మణ్ అనే వ్యక్తి చాలా కాలంగా పనిచేస్తున్నాడు. ప్రభాస్‌ను సరికొత్తగా మేకోవర్ చేయడంలో ఈయనదే ముఖ్యపాత్ర. ప్రభాస్ ఫిట్‌నెస్ పరంగా పర్సనల్ కేరింగ్ తీసుకొని ఎప్పటికప్పుడు తగు సూచనలిస్తుంటాడు లక్ష్మణ్.

ఈ నేపథ్యంలోనే ఆయన సేవలకు గుర్తుగా ఖరీదైన రేంజ్‌రోవర్ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు ప్రభాస్. ఈ సడెన్ సర్‌ప్రైజ్ చూసి లక్ష్మణ్, ఆయన ఫ్యామిలీ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ మేరకు తన కుటుంబంతో ప్రభాస్ వద్దకు వచ్చి ఆయనతో ఫోటోలు దిగాడు లక్ష్మణ్. ఓ ఫిట్‌నెస్ ట్రైనర్ కోసం ప్రభాస్ అందించిన ఈ గిఫ్ట్ చూసి ప్రభాస్ రేంజ్ అంటే ఇదీ అంటూ మురిసిపోతున్నారు ఆయన ఫ్యాన్స్.ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' సినిమా చేస్తున్న ఆయన.. ఆ తర్వాత వరుస సినిమాలను లైన్‌లో పెట్టారు. 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా అలాగే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో మరో భారీ సినిమా 'ఆదిపురుష్' చేయబోతున్నారు ప్రభాస్.

10,000 మంది అమెరికన్స్ కు ఉద్యోగాలు: అమెజాన్

 Amazon Continues Hiring Spree With 10,000 New Jobs Two New Towers

2019 లో ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వాషింగ్టన్లోని బెల్లేవ్‌లో 43 అంతస్తుల కొత్త టవర్‌ నిర్మాణం పని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ 15,000 మంది అమెరికన్స్ కు ఉపాధి కల్పిస్తుంది అని అమెజాన్ ఆ సమయంలో తెలిపింది. అయితే శుక్రవారం 4th సెప్టెంబర్ న అమెజాన్ అదనంగా రెండు మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని దక్కించుకున్నందున ఆ సంఖ్యకు మరింత ఎక్కువ ఉద్యోగాలను జోడించినట్లు అమెజాన్ తెలిపింది.

మొత్తంగా, బెల్లేవ్‌లో అమెజాన్ రాబోయే కొన్నేళ్లలో 25 వేల ఉద్యోగాలను కల్పించడానికి యోచిస్తోంది అని అమెజాన్ తన బ్లాగ్ పోస్ట్ లో పేర్కొంది. అయితే వాటిలో కనీసం 10,000 మంది కొత్త వారిని, మరికొంతమంది ని సీటెల్‌లోని అమెజాన్ ప్రధాన కార్యాలయం నుండి బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. జూన్ 30 నాటికి 877,000 మంది శ్రామికశక్తి తో ఉన్న అమెజాన్ covid-19 కారణం గా డోర్ డెలివరీ కి పెరుగుతున్న డిమాండ్ తీర్చడానికి 75,000 మంది తాత్కాలిక కార్మికులను నియమించుకునే ప్రణాళికను ఏప్రిల్‌లో కంపెనీ ప్రకటించింది.

ప్రపంచమంతటా మొదలైన పీవీ ఉత్సవాలు , అమెరికాలోని కొలంబస్ నగరంలో విజయవంతమైన మొట్టమొదటి సభ

 

pv centenary celebrations starts

సంవత్సరం పాటు బ్రహ్మాండంగా నిర్వహిస్తాం : కేకే

పీవీ కి భారత రత్న కోసం ఆన్లైన్ పిటిషన్ లాంచ్ చేసిన మహేష్ బిగాల

పీవీ గారు అతి సామాన్యంగా ఉండడానికి ఇష్టపడేవారు, ప్రకృతితో పాటు దేశాన్ని కూడా ఆరాధించేవారు : కూతుళ్లు వాణి దేవి , సరస్వతి

అమెరికా అంతటా శత జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తాం : మహేష్ తన్నీరు

తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన స్వర్గీయ మాజీ ప్రధాని పీ.వీ. నరసింహారావు గారి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఖండాంతరాల్లో మొట్టమొదటి కార్యక్రమం అమెరికాలోని ఒహయో రాష్ట్రంలో గల కొలంబస్ నగరంలో తెరాస ఎన్నారై అడ్విసోరీ చైర్మన్ తన్నీరు మహేష్ రావు గారి ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా పీవీ శత జయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు కే.కేశవరావు గారు, ఉత్సవ కమిటి సభ్యులు మహేష్ బిగాల గారు, పీవీ కూతుర్లు సురభి వాణి దేవి గారు పాల్గొన్నారు , కలకోట సర్వసతి గారు 50 సంవత్సరాల నుంచి అమెరికా లో నివాసం వున్నారు , ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పాల్గొని పీవీ గారి స్మృతులను గుర్తుచేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు వారితో పాటు ఇతర రాష్ట్రాల ప్రవాస భారతీయులు, పీవీ అభిమానులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కోవిద్ పరిమితుల దృష్ట్యా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమెరికాలో లోని వివిధ రాష్ట్రాల నుండి పీవీ అభిమానులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని టీవీ ఆసియ తెలుగు వారు ప్రత్యక్ష ప్రసారం చేసారు.

కేశవ రావు గారు మాట్లాడుతూ జ్ఞ్యాన సమున్నత, విధాన నిర్ణయాలు, రాజనీతి, సాహితి సాంస్కృతిక, పరిపాలన, ఆధ్యాత్మికత విషయాల్లో పీవీ గారు ఆయనకు ఆయనే సాటి అని, ఆర్ధిక సంస్కరణలతో ఆధునిక భారతాన్ని ఆవిష్కరించిన దూరాదృష్టి గల నాయకుడని అన్నారు. ప్రధాన మంత్రిగా మరియు వివిధ మంత్రిత్వ హోదాల్లో పీవీ గారు భారత దేశానికి చేసిన సేవలను గుర్తుచేస్తూ వారికి భారత రత్న ప్రదానం చేయడమే సరైన గౌరవ మని, భారత రత్న పురస్కారం గురించి పార్లమెంట్ లో నివేదిస్తామన్నారు. శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఏడాది పాటు ప్రపంచ వ్యాప్తంగా కార్యక్రమాలు, స్మృతి మందిర నిర్మాణం, పీవీ స్వగ్రామమైన వంగరలో స్మారక చిహ్నం, అంతర్జాతీయ స్థాయిలో ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు.

పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, తెరాస ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల గారు మాట్లాడుతూ సీఎం కెసిఆర్ సూచన మేరకు ఏడాది పాటు ప్రపంచవ్యాప్తంగా యాబై దేశాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ అమెరికా, బ్రిటన్, దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా , న్యూజీలాండ్ , సింగపూర్, మలేషియా మరియు మారిషెస్ దేశాల్లో పీవీ గారి విగ్రహాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీ.సీ ఇంకా ముఖ్య నగరాల్లో విగ్రహ ఏర్పాట్లకు ప్రణాళిక రూపాందించామన్నారు అలాగే పీవీ గారికి భారత రత్న ఇవ్వాలని ఆన్లైన్ లో పిటిషన్ ( https://www.change.org/BharatRatnaforPV )లాంచ్ చేసారు , దీని ద్వారా ప్రపంచమంతటా పీవీ అభిమానులు ఆన్లైన్ లో తమ మద్దతు తెలియజేయాలని అన్నారు , అలాగే ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు వచ్చే ఏడాది హైదరాబాద్ లో నిర్వహించే పీవీ శతజయంతి వేడుకలకు అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్ను ముఖ్య అతిధిగా ఆహ్వానించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పారు.

పీవీ నరసింహ రావు గారి వ్యక్తిత్వము మరియు వారి యొక్క భావవ్యక్తీకరణ విధానం గూర్చి వారి కూతురు డాక్టర్ సరస్వతి గారి మాటలలోనే "చేతలు మరియు నడవడి ద్వార ఎదుటి వారిపై చెదరని ముద్ర వేసే వారు ఇంకా మనము ఏదైనా కార్యసాధన చేసేటప్పుడు ఆ పనిలో మనస్ఫూర్తిగా నిమగ్నమైనప్పుడే ఆ పని విజయవంతం చేయగలము అని చెప్పే వారు. అది నా వ్యక్తిత్వము మరియు నడవడిలో చెరగని ముద్ర వేసినాయి".

పీవీ గారు అతి సామాన్యంగా ఉండడానికి ఇష్టపడేవారు, ప్రకృతితో పాటు దేశాన్ని కూడా ఆరాధించేవారు మరియు నిత్యం యోగ సాధన చేసేవారని వారి కూతురు సురభి వాని దేవి గారు అన్నారు.

తన్నీరు మహేష్ గారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గారి సూచనల మేరకు పీవీ శతజయంతి ఉత్సవాలను అమెరికాలోని ముఖ్య నగరాల్లో నిర్వహించడానికి అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని వివిధ సంఘాల సమన్వయంతో ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీ.సీ మరియు ఇతర నగరాల్లో పీవీ విగ్రహావిష్కరణ, పీవీ బహుముఖప్రజ్ఞకు అద్దంపట్టేలా, ఔన్నత్యం దశ దిశలా చాటే విదంగా జాతీయ స్థాయి సదస్సులు, కార్యక్రమాలు ఏడాది పాటు ప్రతినెలా నిర్వహిస్తామన్నారు. 1994 పీవీ గారి అమెరికా పర్యటన గుర్తుచేస్తూ.. ఆ సందర్బంగా అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌తో సమావేశం లో తలెత్తే ప్రశ్నలను పీవీ గారు ముందుగా అంచనా వేసి వివరించడంతో.. క్లింటన్ భారత దేశంలో పెట్టుబడులు, ఆర్ధిక విధానాలపై మరింత ఆసక్తి చూపి భేటీ నిర్ణీత సమయం కన్నా మరో ఇరవై నిమిషాలు కొనసాగించి మన దేశానికి పెట్టుబడులను అందించారని అన్నారు.

ఈ కార్యక్రమ ఏర్పాటుకు ముందుండి అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నారై టి.ఆర్.స్ రీజినల్ కోఆర్డినేటర్ కానుగంటి నవీన్ గారిని పలువురు అభినందించారు. ఈ సమావేశంలో ప్రముఖ ప్రవాస భారతీయులు నీల్ పటేల్, కొలంబస్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రవణ్ చిద్రూప, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఛైర్మెన్ రామకృష్ణ కాసర్ల, అధ్యక్షుడు రజినీకాంత్ కట్టే, ఎన్నారై టి.ఆర్.స్ కార్యదర్శి నరసింహ నాగులవంచా సెంట్రల్ ఒహియో తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ చలసాని, ఎస్.వి టెంపుల్ ట్రస్టీ కేశవ రెడ్డి, అశోక్ ఇల్లందుల, అమర్ రెడ్డి, రమేష్, సాలందరి, కిరణ్, డేవిడ్, గోవర్ధన్, వంశీ, కే.కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

మంచుగా దక్కిన రికార్డు !

 

austrian-man-spends-25-hours-in-box-filled-with-ice-cubes

ఆస్ట్రియాకు చెందిన క్రీడాకారుడు జోసెఫ్‍ కోబెర్ల్ ఈయన. ఎక్కువ సేపు మంచు గడ్డల మధ్యలో ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రియాలోని మెల్క్ నగరంలో శనివారం ఇలా బహిరంగంగా ఓ గాజు పెట్టెలో చెడ్డీ మాత్రమే ధరించి నిలుచుకున్నారు. అనంతరం పెట్టెనిండా మంచు ముక్కలతో నింపించుకున్నారు. శరీరం కొయ్యబారిపోతున్నా ఏ మాత్రం లెక్కచేయ లేదు. రెండు గంటలకు పైగా పెట్టేలోనే ఉన్నారు. ఫలితంగా చైనా క్రీడాకారుడు జిన్‍  షాంఘో 2014లో నెలకొల్పిన గంటా 53 నిమిషాల పది సెకన్ల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. జిన్‍ కంటే జోసెఫ్‍ అధికంగా 8 నిమిషాల 57 సెకన్లపాటు మంచు ముక్కల మధ్యలో ఉన్నారు.

సీఎం కేసీఆర్ కు బాలకృష్ణ కృతజ్ఞతలు

 

Balakrishna thanks CM KCR for including NTR s life history in 10th standard syllabus

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‍కు అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి జీవితాన్ని భవిష్యత్‍ తరాలకు తెలిపేలా పాఠ్యపుస్తకాల్లో ప్రచురించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు బాలయ్య ఫేస్‍బుక్‍ వేదికగా ఓ పోస్టు చేశారు. పుస్తకంలో కథనానికి సంబంధించిన ఫొటోల్ని కూడా షేర్‍ చేశారు. కళకి, కళాకారులకి విలువ పెంచి కథానాయకుడు, తెలుగోడి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ పీఠాన్ని కదిలించేలా వినిపించిన మహానాయకుడు ఎన్నో సహసోపేతమన ప్రజారం జక నిర్ణయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజా నాయకుడు, మద్రాసీయులమనే పేరుని చెరిపి భారతదేశ పటంలో తెలుగువాడికి, తెలుగు వేడికి ఒక ప్రత్యేకతను తెచ్చిన తెలుగుజాతి ముద్దు బిడ్డ మా నాన్నగారు నందమూరి తారకరామారావు. భవిష్యత్‍ తరాలకు స్ఫూర్తినిచ్చేలా ఆయన గురించి 10వ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా చేర్చిన తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రికి కేసీఆర్‍కు నా హృదయ పూర్వక ధన్యవాదాలు అని బాలయ్య పేర్కొన్నారు.