Sunday, August 30, 2020

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు : మోదీ

 

PM Modi tweets greetings on Telugu Language Day

ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుగులోనే తెలియజేశారు. తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న అందరికీ, ముఖ్యంగా యువతకు ధన్యవాదాలు అంటూ శనివారం ట్వీట్‍ చేశారు. ఈ సందర్భంగా తెలుగు భాషాద్యమ పితామహుడు గిడుగు వెంకట రామ్మూర్తిని స్మరిస్తూ ప్రధాని నివాళులర్పించారు. గిడుగు తన సాహిత్యంతో, సాంఘిక సంస్కరణా దృక్పథంతో ఎన్నో తరాలపై చెరగని ముద్ర వేశారని కొనియాడారు.

లక్షణాలు లేకపోయినా... పిల్లల ద్వారా వైరస్

 Coronavirus spreading through children


కరోనా బారినపడిన పిల్లల్లో ఇన్ఫెక్షన్‍ లక్షణాలు బయటపడకున్నా వారి ద్వారా 3 వారాల పాటు వైరస్‍ వ్యాపించే అవకాశం ఉంటుందని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అక్కడి 22 ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఇన్ఫక్షన్‍ లక్షణాలు బయటపడని 91 మంది పిల్లల్లో వచ్చిన మార్పులపై అధ్యయనం చేశారు. వారికి 3 రోజులకు ఒకసారి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 20 శాతం మందిలో ఇన్ఫెక్షన్‍ లక్షణాలు పూర్తిగా వెలుగు చూసేందుకు 3 రోజుల నుంచి 3 వారాలు పట్టింది. వారిలో వైరల్‍ లోడ్‍ మాత్రం పెరుగుతూపోయింది.

ఘనంగా తానా తెలుగు భాషా దినోత్సవం

 

TANA Telugu Basha Dinostavam Celebrations

హాజరైన తెలుగు భాషా ప్రముఖులు 

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించింది. అంతర్జాల వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు, ప్రముఖులు పాల్గొన్నారు. తానా మాజీ అధ్యక్షులు జంపాల చౌదరి, వంగూరి ఫౌండేషన్‍ అధినేత డా. వంగూరి చిట్టెన్‍ రాజు, కౌముది నెట్‍ సంపాదకులు కిరణ్‍ ప్రభ, సిలికానాంధ్ర వ్యవస్థాపకులు ఆనంద్‍ కూచిభొట్ల, పారుపల్లి కోదండరామయ్య తెలుగు భాషోద్యమకర్త, నందివెలుగు ముక్తేశ్వర రావు - ఐఎఎస్‍, నల్గొండ జిల్లా పూర్వ కలెక్టర్‍, గారపాటి ఉమామహేశ్వర రావు, హైదరాబాద్‍ విశ్వవిద్యాలయం, మన్నం వెంకట రాయుడు - మనసు ఫౌండేషన్‍, బెంగళూరు,  డా. సి.ఎం.కె రెడ్డి, అల్‍ ఇండియా తెలుగు ఫెడరేషన్‍, చెన్నై, ప్రో. గణేష్‍ తొట్టెంపూడి - హైడెల్‍ బర్గ్ విశ్వవిద్యాలయం, జర్మనీ, శీను. జి - తెలుగు పలుకు, ఆస్ట్రేలియా, సంజీవ నరసింహ అప్పడు - తెలుగు రేడియో/టి.వి వ్యాఖ్యాత, మారిషస్‍ ప్రభుత్వం, మల్లికేశ్వర రావు కొంచాడ, ఆస్ట్రేలియా, అప్పాజీ అంబరీష దర్భా,  తెలుగు ఖతి రూపకర్త, పురుషోత్తమ్‍ కుమార్‍ గుత్తుల - తెలుగు ఖతి రూపకర్త, హైదరాబాద్‍, వీవెన్‍- సాంకేతిక తెలుగు (లేఖిని), హైదరాబాద్‍, వాడపల్లి శేషతల్పశాయి- ఆంధ్రభారతి.కామ్‍, హైదరాబాద్‍, యర్ర (బర్మా) నాయుడు- తెలుగు బడి, బర్మా తదితరులు ఇందులో పాల్గొన్నారు.

తానా అధ్యక్షులు జయ్‍ తాళ్ళూరి, తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు ప్రసాద్‍ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్‍ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం తెలుగువైభవాన్ని మరోసారి అందరికీ తెలియజేసేలా సాగింది. జయ్‍ తాళ్ళూరి మాట్లాడుతూ, మాతృభాష రాని మనిషి మాటలు డొల్ల/ తలపులోని మాట తెలుపు టెల్ల/ తెడ్డు లేని  పడవ వొడ్డు  చేరుట కల్ల/ తెలుగు వీడ కోయి తెలుగు వాడ.’’ అన్నట్లు...మాతృభాష రాని వారి మాటలు నిస్సారంగా ఉంటాయి. ఏ  విషయాన్ని స్పష్టంగా చెప్పలేరు. తెడ్డు లేని పడవ వొడ్డు చేరడం ఎలా సందేహాస్పదమో... మాతృభాష పునాదిగా లేని వారు కూడా తమ లక్ష్యాన్ని చేరుకోవడం సుసాధ్యం కాదు. కాబట్టి మాతృభాషను ఎవరూ వదలకూడదు. ఎందుకంటే మాతృభాష అనేది కేవలం భావ ప్రసారానికి సాధనం మాత్రమే కాదు. ఒక జాతి సంస్కృతికి వారధి మాతృభాష. ఒక జాతి సమున్నత విజ్ఞానానికి సారధి మాతృభాష. ఒక తరం నుంచి మరో తరానికి విలువైన సాంప్రదాయ సంపదను అందించగల అనుసందాత మాతృభాష. మాతృ భాష ఒక నినాదం కాదు..మాతృభాష ఒక జాతి జీవన విధానం! జాతి మనుగడకు అది ప్రధానం..!, ఇటువంటి భాషను మరచిన ఏ జాతికైనా అస్తిత్వం లేదు అని అంటూ, తానా భాషా వికాసం కోసం  గత నాలుగు దశాబ్దాలుగా ఎంతో కృషి చేసింది.  

అనేక మంది కవులను ప్రపంచ వేదిక కు పరిచయం చేసింది. ‘అంతర్జాల తెలుగు మహా నిఘంటువు’’ను రూపొందించింది. ‘‘అమ్మానాన్న గురు వు పద్యార్చన’’  పేరుతో 6 లక్షల మంది విద్యార్థుల తో ఒకే రోజు పద్యాలు పాడించడం. 50 దేశాలలోని  100 సంస్థలతో  కలిసి 18 వేల మందితో ‘‘తెలుగు సాంస్కృతిక మహోత్సవాలు’’ నిర్వహించడం జరిగింది. అమెరికాలోని ప్రవాసాంధ్రుల పిల్లలకు తెలుగు భాష బోధించటానికి ప్రతిష్టాత్మకంగా అమెరికాలోని అనేక నగరాలలో ‘పాఠశాల’ పేరుతో ఒక బృహత్‍ భాషా యజ్ఞం  నిర్వహిస్తోంది.  ప్రపంచంలోని తెలుగు కవులను, భాషా ప్రియులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి భాషా వికాసానికి తోడ్పడే ఉద్దేశంతో ‘‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’’ ఏర్పాటు చేసి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వివిధ దేశాల్లో భాషా సేవలు చేస్తున్న మీరందరూ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అతిధుల ప్రసంగాలు, సందేశాలు రానున్న భాషా ఉద్యమాలకు ప్రేరణగా నిలుస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన వక్తలంతా తమతమ ప్రాంతాల్లో జరుగుతున్న తెలుగుభాషా పరిరక్షణ చర్యలను తెలుపుతూ, తెలుగు భాష గొప్పదనాన్ని వివరించారు.

సీఎం జగన్ డైనమిక్ లీడర్.. ఆయనకు దేవుడి ఆశీస్సులు ఉంటాయి ‘కింగ్ నాగార్జున' ట్వీట్

 

nagarjuna tweets on ys jagan

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడంపై నాగార్జున స్పందించారు.టాలీవుడ్ ‘కింగ్’ నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువలా వచ్చాయి. సినీ, రాజకీయ రంగాలకు చెందిన చిన్నా, పెద్ద ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందినవాళ్లు నాగార్జునకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నాగార్జునకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ‘‘తెలుగు సినీ ప్రపంచంలో ఎందరో గొప్ప నటుల్లో ఒకరైనా అక్కినేని నాగార్జున్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీకు ఆయురారోగ్యాలు, మరిన్ని విజయాన్ని ప్రసాదించాని భగవంతున్ని కోరుకుంటున్నాను’’ అని సీఎం జగన్ ట్వీట్ చేసిన దాదాపు 19 గంటల తర్వాత నాగార్జున స్పందించారు. సీఎం జగన్ డైనమిక్ లీడర్ అని, తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలు తెలిపారు. ‘ప్రియమైన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమపూర్వక మాటలకు ధన్యవాదాలు. మీరు ఆయురారోగ్యాలతో ఆనందంగా గడపాలని ఆకాంక్షిస్తున్నాను. నాకు తెలుసు.. మీ డైనమిక్ లీడర్ షిప్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వాంగసుందరంగా రూపుదిద్దుకుంటుంది. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు.’’ అని నాగార్జున రిప్లై ఇచ్చారు.

https://twitter.com/ysjagan/status/1299683127028146176

https://twitter.com/iamnagarjuna/status/1299978112579510278

ప్రభాస్‌పై అమెరికన్ పాప్ సింగర్ ఓ హేవ్ మెర్సీ ప్రశంసలు.. బిగ్ థ్యాంక్స్ చెప్పిన రెబల్ స్టార్


htprabhas-thanks-to-american-pop-singer-mercy-for-bang-bang-song-in-saaho

 'సాహో’ సినిమా ఏడాది పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సెలబ్రేషన్స్ చేసుకుంటోంది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘సాహో’. సుజీత్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ గతేడాది ఆగస్టు 30న విడుదలైంది. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా విడుదలైన ఈ పాన్ ఇండియా మూవీ బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద బాగానే వసూలు చేసింది.

అయితే, తెలుగు సహా ఇతర భాషల్లో రాణించలేకపోయింది. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్ల మేర గ్రాస్ వసూలుచేసింది,ఇదిలా ఉంటే, నేటితో ఈ చిత్రం ఏడాది పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. అలాగే, హీరో ప్రభాస్ తన డైహార్డ్ ఫ్యాన్స్‌కి, చిత్ర యూనిట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు, అమెరికన్ పాప్ సింగర్, మోడల్ మెర్సీకి కూడా ప్రభాస్ కృతజ్ఞతలు తెలిపారు. దీనికి ఒక కారణం ఉంది. సాహోలో ‘బ్యాంగ్ బ్యాంగ్’ అంటూ వచ్చే ఇంగ్లిష్ సాంగ్‌ను మెర్సీ ఆలపించారు.

‘సాహో’ ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా మెర్సీకి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బిగ్ థ్యాంక్స్ చెప్పారు. అంతేకాదు, ఆమె పాడిన సాంగ్‌ను కూడా పోస్ట్ చేశారు.మెర్సీ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను ‘సాహో’ సెలబ్రేషన్స్‌తో నింపేశారు. ఇప్పటి వరకు అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ప్రభాస్ ఒకరని మెర్సీ కొనియాడారు. నిజాయతీగా చెప్పాలంటే ఆయన గొప్ప వ్యక్తని ప్రశంసించారు. ప్రభాస్‌తో మరోసారి కలిసి పనిచేయాలనుందని పేర్కొన్నారు. అలాగే, ‘సాహో’ వంటి సినిమాలో తనకు పనిచేసే అవకాశం రావడం నిజంగా అదృష్టమని మెర్సీ అన్నారు. చాలా మంచి టీమ్‌తో తాను పనిచేశానని సంతోషంగా చెప్పారు.