అధ్యక్ష ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరియు మాజీ ఉపాధ్యక్షులు జో బిడెన్ ఓటర్లను ఆకర్షించటానికి చిన్న విషయాలను కూడా వదలకుండా వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న సంగతి తెలిసిందే! గత వారం అట్లాంటిక్లో అద్ధ్యక్షులు ట్రంప్ మిలిటరీ సభ్యులను మరియు అమెరికా యుద్ధంలో చనిపోయిన వారిని "ఓడిపోయినవారు" మరియు "సక్కర్లు" అని వ్యాఖ్యానించడంతో ప్రతిపక్షాలు అమెరికా అద్ధ్యక్షులు అయిఉండి వీర జవాన్లను ఓడిపోయినవారు గా ఎలా పిలవగలుగుతారు అని ప్రశ్నించడంతో అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ నార్త్ పోర్టికో వైట్ హౌస్ మీడియా సమావేశం లో గత వారం అట్లాంటిక్లో మిలిటరీ సభ్యుల ప్రసంగాన్ని ఉద్దేశించి ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలకు “నేను ఎవరినీ ఓడిపోయినట్లు లేదా సక్కర్లు గా పిలవలేదు నేను యుద్ధ వాతావరణాన్ని ఉద్దేశించి మాత్రమే చెప్పిన మాటలు.” అని స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నించారు.
నవంబర్ మొదటి వారం నాటికి కవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటు పై డెమొక్రటిక్ నామినీ జో బిడెన్ మరియు డెమోక్రాటిక్ పార్టీ వైస్-ప్రెసిడెంట్ సేన్. కమల హర్రీస్ “అద్ధ్యక్షులు ట్రంప్ వ్యాఖ్యలు విశ్వసించదగినవి కాదు” అని చేసిన వ్యాఖ్యలకి అద్ధ్యక్షులు ట్రంప్ కు వెంటనే క్షమాపణ చెప్పాలి అని అద్ధ్యక్షులు ట్రంప్ డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment