ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుగులోనే తెలియజేశారు. తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న అందరికీ, ముఖ్యంగా యువతకు ధన్యవాదాలు అంటూ శనివారం ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తెలుగు భాషాద్యమ పితామహుడు గిడుగు వెంకట రామ్మూర్తిని స్మరిస్తూ ప్రధాని నివాళులర్పించారు. గిడుగు తన సాహిత్యంతో, సాంఘిక సంస్కరణా దృక్పథంతో ఎన్నో తరాలపై చెరగని ముద్ర వేశారని కొనియాడారు.
No comments:
Post a Comment