Friday, April 24, 2020

రవితేజ, కళ్యాణ్ రామ్, సాయి ధరమ్ తేజ్ లకు ఛాలెంజ్ విసిరినా అనిల్ రావి పూడి

రవితేజ, కళ్యాణ్ రామ్, సాయి ధరమ్ తేజ్ లకు  ఛాలెంజ్ విసిరినా అనిల్ రావి పూడి

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ‘బీ ది రియల్ మెన్’ అనే ఛాలెంజ్ నడుస్తోంది. ఈ ఛాలెంజ్‌కు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, రాజా మౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌‌, కీరవాణి, కొరటాల శివ, సుకుమార్‌, నిర్మాత శోభు యార్లగడ్డ, క్రిష్ వీళ్లంతా ఛాలెంజ్ ను స్వీకరించి ఇల్లు ఊడ్వడం, పాటు ఇంట్లో బాసాన్లు కడగటం బట్టలు ఉతకటం తోట పనులు చేయడం తో బాటు వంట చేయడం వంటి పనులు చేస్తున్నారు.
ఈ రోజు దర్శకుడు అనిల్ రావి పూడి ఇల్లు శుభ్రం చేసి, బట్టలు మడత పెట్టి, అంట్లు తోమి, తల్లికి వంట సాయం చేసి మొక్కలకు నీళ్లు పోసాడు. మొత్తానికి లాక్‌డౌన్‌లో ఇంట్లో ఉన్న సెలబ్రిటీలు ఇపుడు ఇంట్లో పనులు చేస్తూ.. అభిమానులతో ప్రజలకు కూడా ఇంట్లో ఆడవాళ్లకు సాయం చేయమని మంచి సందేశం ఇస్తున్నారు.

No comments:

Post a Comment