Saturday, April 25, 2020

ఎన్టీఆర్ సరసన శ్రుతిహాసన్ ?



ఎన్టీఆర్ సరసన శ్రుతిహాసన్ ?
అరవిందసమేత  వీరరాఘవ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్‍, దర్శకుడు త్రివిక్రమ్‍ కాంబినేషన్‍లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎస్‍.రాధాకృష్ణ(చినబాబు), నందమూరి కల్యాణ్‍రామ్‍ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందులో కథానాయికగా ఇప్పటివరకు పూజా హెగ్డే, కియారా అద్వానీల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ చిత్రంలోని హీరోయిన్‍ పాత్ర కోసం శ్రుతీహాసన్‍ పేరు కూడా చిత్రబృందం పరిశీలిస్తోందనే టాక్‍ ఫిల్మ్ నగర్‍లో వినిపిస్తోంది. దాదాపు ఏడేళ్ల క్రితం వచ్చిన రామయ్యా వస్తావయ్యా చిత్రంలో ఎన్టీఆర్‍ సరసన ఓ కథానాయికగా శ్రుతీహాసన్‍ నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. మళ్లీ ఈ జోడీ కుదురుతుందా? వెయిట్‍ అండ్‍ సీ.

No comments:

Post a Comment