సెర్చింజిన్ దిగ్గజం గూగుల్ తన వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ మీట్ సేవలను భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా అందించాలని నిర్ణయించింది. రానున్న వారాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం మీట్లో ప్రతిరోజు 300 కోట్ల నిమిషాలపాటు వీడియో సమావేశాలు జరుగుతున్నాయి. రోజు 30 లక్షల మంది కొత్త వినియోగదారులు చేరుతున్నారు. కరోనా వైరస్ ఉద్థ•తి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ సమావేశాలు పెరిగిపోయిన నేపథ్యంలో మీట్ సేవలను ఉచితం చేయాలని గూగుల్ నిర్ణయించినట్లు సమాచారం. మీట్ సేవలు వినియోగించుకోవాలనుకునే వారికి కచ్చితంగా గూగుల్ ఖాతా ఉండాలి.
No comments:
Post a Comment