Monday, May 25, 2020

ఇది అంతులేని వింత క‌థ‌...!


ఇది అంతులేని వింత క‌థ‌...!
ప్ర‌భాస్‌, అనుష్క ఇద్ద‌రూ క‌లిసి బిల్లా, మిర్చి, బాహుబ‌లి సిరీస్‌లో న‌టించారు. ఈ ఇద్ద‌రి గురించి మొద‌టి నుంచి రూమ‌ర్స్ వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నార‌ని, త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నార‌నే రూమ‌ర్స్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి. వీళ్లకు సంబంధించి ఎప్పుడు న్యూస్ బ‌య‌టికి వ‌చ్చినా దాన్ని ఇద్ద‌రూ ఖండిస్తూ వ‌స్తున్నారు. తామిద్ద‌రం స‌హ‌స‌టులం, మంచి స్నేహితులం. అంతేత‌ప్ప మా మ‌ధ్య ఎలాంటి ఎఫైర్ లేదు అని ప‌దే ప‌దే చెబుతున్నారు.
ఈ విష‌యాన్ని కృష్ణంరాజు కూడా చాలా సార్లు ఖండించారు. అయినా వీరికి సంబంధించిన రూమ‌ర్స్ అస్స‌లు త‌గ్గ‌డం లేదు. ఏదో ఒక సంద‌ర్భంలో ప్ర‌భాస్‌, అనుష్క‌ల ప్రేమాయ‌ణం గురించి మీడియాలో ప్ర‌స్తావ‌న వ‌స్తూనే ఉంది. ఇదిలా ఉంటే ఈమ‌ధ్య అనుష్క త‌ల్లి ప్ర‌ఫుల్లా శెట్టి సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌పై స్పందిస్తూ..`అనుష్క, ప్ర‌భాస్ స‌హ‌న‌టులు మాత్ర‌మే. వారి మ‌ధ్య ఎలాంటి ఎఫైర్ లేదు. అయితే నిజ జీవితంలో అనుష్క‌కు ప్ర‌భాస్ లాంటి ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్ జీవిత భాగ‌స్వామి కావాల‌ని కోరుకుంటున్నాను` అని వ్యాఖ్యానించింది. దీంతో ప్ర‌భాస్‌, అనుష్క వ్య‌వ‌హారం మ‌ళ్లీ మొద‌టికొచ్చింది. మ‌రి దీనిపై నెటిజెన్లు ఎలా స్పందిస్తారో! ఎలాంటి కామెంట్స్ చేస్తారో చూడాలి.

No comments:

Post a Comment