Saturday, June 27, 2020

బొమ్మ ఆడలేదు కానీ థియేటర్ లో 100 రోజులు సీటులే ప్రేక్షకులు


Theaters running unsuccessful 100 days
రన్నింగ్ ఆన్ సక్సెస్ ఫుల్ 100 డేస్!   థియేటర్ సీట్లే ప్రేక్షకులు  
థియేటర్ లో ఒక సినిమా కంటిన్యూ గా 100 రోజులు ఆడితే అది రికార్డు గా పరిగణించి, ఆయా హీరోల అభిమానులు థియేటర్ వద్ద సంబరాలు చేసుకునే వారు.  ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి విజృభిస్తున్న తరుణంలో  బొమ్మ ఆడలేదు కానీ థియేటర్ లో  100 రోజులు సీట్లు ప్రేక్షకులయ్యాయి   మునుపెన్నడూ లేని విధంగా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ప్రపంచ సినిమా పరిశ్రమ ఓ విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్నది. వందేళ్లకుపైగా సినిమా చరిత్రలో 100 రోజులుపాటు సినీ థియేటర్లు మూతపడిన దాఖలాలు లేవు. కరోనావైరస్ కారణంగా సినీ పరిశ్రమ, కార్మికులు, నటులు, నిర్మాతలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కరోనా పరిస్థితులు చక్కబడితే మళ్లీ సినిమా పరిశ్రమను పూర్వ వైభవం వైపు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. గత 100 రోజుల్లో సినీ పరిశ్రమలో చోటుచేసుకొన్న పరిణామాలు ఏమిటంటే..
తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రాణాంతక వ్యాధిని నివారించేందుకు లాక్‌డౌన్ ప్రకటించారు. ఈ క్రమంలోనే మార్చి 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్లలో సినిమా ప్రదర్శనలు నిలిపివేశారు. దాంతో సినీ ప్రేక్షకుల వినోదానికి బ్రేక్ పడింది. రెండు వారాల గడువుతో మొదలైన లాక్‌డౌన్ ఇప్పటికి 100 రోజులకు చేరుకొన్నది.
కరోనా వైరస్ పరిస్థితులు తీవ్రతరం కావడంతో సినిమా షూటింగులు నిలిపివేశారు. టెలివిజన్ సిరియల్స్, షోల షూటింగ్స్ స్టార్ట్ అయినా  అంతరాయం ఏర్పడింది. రోజువారి వేతన కార్మికుల జీవితం సందిగ్గంలో పడింది. పలు సినిమాల రిలీజ్‌లు ఆగిపోయాయి. దాంతో సినీ పరిశ్రమ కూడా ఇప్పటి వరకు చూడని దారుణమైన పరిస్థితి చూడాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా పలు భాషల సినిమా పరిశ్రమల్లో సహాయక చర్యలు ఊపందుకొన్నాయి. బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, తదితర నటులు ముందుకొచ్చి విరాళాలు ప్రకటించారు. ఇక టాలీవుడ్‌లో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఏర్పాటైంది. దాంతో ఇండస్ట్రీలోని వేతన కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణి, సహాయ కార్యక్రమాలు రెండు సార్లు  నిర్విరామంగా కొనసాగించాయి.  
సినిమా థియేటర్లు మూత పడటంతో వాటి స్థానంలోకి అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5, ఆహా లాంటి ఓటీటీ ఫ్లాట్‌ఫాంతోపాటు మరికొన్ని కొత్తగా పుట్టుకొచ్చాయి. రిలీజ్‌కు సిద్దమై ఆగిన సినిమాలన్నీ ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. అమృత రామం,  అమితాబ్ నటించిన గులాబో సితాబో, జ్యోతిక నటించిన పోంమగాళ్ వండాల్, కీర్తీ సురేష్ నటించిన పెంగ్విన్, ఇటీవల కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 47డేస్ జూన్ 30న, భానుమతి రామకృష్ణ జులై 3న  ఇంకా కొన్ని రిలీజ్‌కు క్యూ కట్టాయి. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత సినీ అగ్రతారలు, నిర్మాతలు కలిసి ప్రభుత్వాలతో చర్చలు జరిపారు. షూటింగులతోపాటు సినిమాల ప్రదర్శనకు థియేటర్లను ఓపెన్ చేయాలని సర్కార్లకు విన్నపాలు చేశారు. ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందించి షూటింగులకు అనుమతులు ఇచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో షూటింగుల కదలిక మొదలైంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఊహించని విధంగా కరోనా కేసులు పెరిగిపోవడంతో షూటింగులకు యూనిట్లు ముఖం చాటేస్తున్నాయి.  కానీ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇప్పుడిప్పుడే సినిమా థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. ఆట ఆటకు థియేటర్ శానిటైజ్ చేసి సీట్ సీటుకు గ్యాప్ ఏర్పాటు చేసి   న్యూజిలాండ్, దుబాయ్ లాంటి దేశాల్లో పరిస్థితులకు అనుగుణంగా థియేటర్లలో ప్రదర్శనలు ప్రారంభమైనప్పటికీ ప్రేక్షకులు థియేటర్కి రావడానికి సముఖంగా లేరు.  

No comments:

Post a Comment