జాక్సన్విల్ తెలుగు అసోసియేషన్ (తాజా) కొత్త అధ్యక్షుడిగా పాపారావు గుమ్మడపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాజా వేదిక ద్వారా మరిన్ని చక్కటి కార్యక్రమాలకు రూపకల్పన చేసి అందరి సహకారంతో నిర్వహించనున్నట్లు చెప్పారు. కరోనా మహమ్మారి జనజీవితాలను నాశనం చేస్తున్న సమయంలో అందరం జాగ్రత్తగా ఉంటూ, తెలుగువాళ్ళకు ఏ అవసరం వచ్చినా, కష్టం వచ్చినా తాజా తరపున సహాయ సహకారాలను అందిస్తామని ఆయన హామి ఇచ్చారు. తెలుగు యువతకు మార్గనిర్దేశం చేస్తూ, మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
కొత్త తాజా కార్యవర్గం 2020-21 వివరాలు...
పాపారావు గుమ్మడపు (ప్రెసిడెంట్), లక్ష్మీ సతీష్కుమార్ (వైస్ప్రెసిడెంట్), శంకర కుప్ప (ట్రెజరర్), వసుంధర శ్రీకాకుళపు (సెక్రటరీ), సురీష్ గుడిమెట్ల (ఆపరేషన్స్ -విపి), సురేష్ మిట్టపల్లి (ప్రెసిడెంట్ ఎలక్ట్), శ్రీనివాస రవి (యూత్ కమిటీ చైర్), లత కోట (యూత్ కమిటీ కో చైర్), మహేష్ బాబు గునుకుల (తెలుగు బడి చైర్), సంధ్య ఈశ్వర (కల్చరల్ చైర్), శ్వేత శరభన్న (కమ్యూనికేషన్స్ చైర్), సుమన్ సజ్జన్న (ఎవి చైర్), నవీన్ మొదలి (పిఆర్ చైర్), సునీల్ మెరుగు(వెబ్ చైర్), మాధవి (సంక్రాంతి చైర్), శిరీష పాలకల్లూరి (సంక్రాంతి కో చైర్), పద్మ ప్రియ కొల్లూరు (ఉగాది చైర్), సమత చంద్ర (ఉగాది కో చైర్), పున్నయ్య శాస్త్రి జంధ్యాల (స్పోర్టస్ చైర్), రాజ్ బండారు (స్పోర్టస్ కో చైర్), నారాయణ కసిరెడ్డి (ఫుడ్ చైర్), రామకృష్ణ (ఆపరేషన్స్ - చైర్), కావ్య పాలరపు(ఈవెంట్స్ డెకరేషన్స్ - చైర్), శ్రీధర్ కండే (ఆపరేషన్స్ - కో చైర్).
No comments:
Post a Comment