కట్టడి చేయకపోతే ఇక ఆశ వదులుకోవాల్సిందే...ఆంథోనీ ఫౌసి
కరోనా వైరస్ అమెరికాను వణికిస్తోంది. అక్కడ లక్షల్లో కేసులు నమోదు కావడమే కాకుండా మరణాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. యూనైటెడ్ స్టేట్స్లో ప్రస్తుతం 130,284 మంది కరోనాతో మరణించారు. ఇది బ్రెజిల్లో మరణాల సంఖ్య కంటే రెండు రెట్లు అధికం. యూఎస్లో మొత్తం జనాభా 328మిలియన్లు కాగా, బ్రెజిల్ జనాభా 210 మిలియన్లుగా ఉంది.
కరోనా కట్టడికి అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో దేశ్యవాప్తంగా కరోనా కేసులు ఒక్కరోజే లక్షల్లో నమోదయ్యే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డీసీజేస్ హెడ్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ ఇప్పటికే హెచ్చరించారు. గుంపులుగా తిరగకండి...మాస్క్లు ధరించండి చెబుతున్నా పట్టించుకోవడం లేదు. దీనిపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టకపోతే అమెరికాలో రోజుకు లక్షల్లో మరణాలు సంభవించడం ఖాయమని ఫౌసీ అఞటున్నారు. ఇప్పటికే ఈ విషయమై ఆయన పలువురితో చర్చించారు.
No comments:
Post a Comment