Wednesday, July 8, 2020

యాంటీ ట్రస్ట్ విచారణకు దిగ్గజ సీఈవోలు

Tech CEOs to testify before US House anti-trust panel on July 27

అమెరికా టెక్నాలజీ దిగ్గజ కంపెనీల సీఈవోలు హౌస్‍ జ్యూడీషియరీ కమిటీ యాంటీట్రస్ట్ (పోటీ నిరోధానికి సంబంధించి) విచారణకు ఈ నెల 27న హాజరు కానున్నారు. వీరిలో గూగుల్‍ సీఈవో సుందర్‍ పిచాయ్‍, ఫేస్‍బుక్‍ సీఈవో జుకర్‍బర్గ్, యాపిల్‍ టిమ్‍ కుక్‍, అమెజాన్‍ అధినేత జెఫ్‍ బెజోస్‍ ఉన్నారు. ఆన్‍లైన్‍ మార్కెట్‍లో పోటికి సంబంధించి యాంటీట్రస్ట్ ప్యానెల్‍ విచారణలో పాల్గొనాల్సి ఉంటుందని వాషింగ్టన్‍కు చెందిన ఓ పోర్టల్‍ పేర్కొంది.

No comments:

Post a Comment