Wednesday, July 8, 2020

నాలో.. నాతో వైఎస్సార్


YS Vijayamma s Nalo Natho YSR Book Launch
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‍ రాజశేఖర్‍ రెడ్డి సతీమణి వైఎస్‍ విజయమ్మ రాసిన నాలో. నాతో.. వైఎస్సార్‍ పుస్తకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ మోహన్‍ రెడ్డి ఆవిష్కరించనున్నారు. మహానేత 71వ జయంతి సందర్భంగా వైఎస్‍ విజయమ్మ రచించిన ఈ పుస్తకాన్ని ఇడుపులపాయలో ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ విడుదల చేయనున్నారు. దివంగత నేత వైఎస్సార్‍ సహధర్మ చారిణిగా విజయమ్మ తన 37 ఏళ్ల జీవిత సారాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. అనూహ్యంగా 2009 సెప్టెంబర్‍ 2, వైఎస్సార్‍ హెలికాప్టర్‍ ప్రమాదంలో మరణించిన నాటి నుంచి కలిగిన భావోధ్వేగాల సమాహారమే ఈ పుస్తకం. మహా నేత వైఎస్సార్‍ గురించి లోకం ఏమనుకున్నది, ప్రజల నుంచి తాను తెలుసుకున్న విషయాలతో పాటు ప్రజలకు తెలియని కొన్ని అంశాలను తెలిపేందుకే ఈ పుస్తకాన్ని తీసుకువచ్చినట్లు వైఎస్‍ విజయమ్మ తొలి పలుకుల్లో తెలిపారు.

No comments:

Post a Comment