ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధ•తి కొనసాగుతోంది. తాజాగా మరో 8 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 74,595 శాంపిల్స్ పరీక్షించగా, 8218 పాజిటివ్ కేసులు, 58 మరణాలు నమోదయ్యాయి. 10,820 మంది కొత్తగా కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు మొత్తంగా 50,33,676 శాంపిల్స్ను పరీక్షించగా.. 6,17,776 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 5302 మంది ప్రాణాలు కోల్పోగా.. 5,30,711 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 81,763 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ వైరస్ తీవ్రత కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1395 కేసులు నమోదవ్వగా, పశ్చిమగోదావరి జిల్లాలో 1071 పాజిటివ్ కేసులు వచ్చాయి.
గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి చిత్తూరు జిల్లాలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, కృష్ణా జిల్లాలో ఏడుగురు, అనంతపురం, గుంటూరు, కడప, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున, నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో నలుగురేసి చొప్పున మృతిచెందారు. అలాగే, తూర్పు గోదావరి, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురేసి మృతి చెందగా, విజయనగరం జిల్లాలో ఒకరు ప్రాణాలు విడిచారు.
No comments:
Post a Comment