Saturday, September 19, 2020

చురుగ్గా అంతర్వేది రథం నిర్మాణం పనులు..




 అంతర్వేది నూతన రథం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.. దీనిలో భాగంగా రావులపాలెం టింబర్‍ డిపోలో రథం నిర్మాణానికి అవసరమైన బస్తర్‍ టేకు కలప దుంగలను అధికారులు గుర్తించారు. 21 అడుగుల పొడవైన దూలాలుగా వాటిని కోయించే పక్రియ నేడు ప్రారంభమైంది. రథం నిర్మాణానికి 1330 ఘనపుటడుగుల కలప వినియోగిస్తున్నామని దేవాదాయ శాఖ అదనపు కమిషనర్‍ రామచంద్ర మోహన్‍ తెలిపారు. పాత రథం నమూనాలోనే అంతర్వేది ఆలయ కొత్త రథం నిర్మాణ డిజైన్లను దేవదాయ శాఖ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 41 అడుగుల ఎత్తు, ఆరడుగుల వెడల్పుతో ఏడంతస్తుల్లో ఆలయ రథం ఉంటుందని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇటీవల వివరించారు. ఆరు చక్రాలతో కూడిన కొత్త రథం నిర్మాణంతో పాటు, రథశాల మరమ్మతులకు రూ.95 లక్షలు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు

No comments:

Post a Comment