పశ్చిమ కృష్ణా తీరంలోని జగ్గయ్యపేట మండలం వేదాద్రి క్షేత్రం సమీపంలో రూ.368 కోట్లతో భారీ ఎత్తిపోతల పథకానికి ఆంధప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానం ద్వారా ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతల పేరుతో రూపొందించిన ఈ ఎత్తిపోతల ద్వారా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని మూడు మండలాలకు చెందిన 28 గ్రామాల ఎన్ఎస్పీ భూములకు సాగునీరు అందనుంది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్, రాష్ట్ర మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment