Friday, August 28, 2020

వేదాద్రి ఎత్తిపోతలకు సీఎం జగన్ శంకుస్థాపన

 

CM Jagan Launches Vedadri Llift Irrigation Scheme

పశ్చిమ కృష్ణా తీరంలోని జగ్గయ్యపేట మండలం వేదాద్రి క్షేత్రం సమీపంలో రూ.368 కోట్లతో భారీ ఎత్తిపోతల పథకానికి ఆంధప్రదేశ్‍ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ మోహన్‍ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‍ విధానం ద్వారా ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. వైఎస్‍ఆర్‍ వేదాద్రి ఎత్తిపోతల పేరుతో రూపొందించిన ఈ ఎత్తిపోతల ద్వారా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని మూడు మండలాలకు చెందిన 28 గ్రామాల ఎన్‍ఎస్పీ భూములకు సాగునీరు అందనుంది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‍కుమార్‍ యాదవ్‍, రాష్ట్ర మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment