Tuesday, June 30, 2020

వన్ స్టేట్...వన్ క్యాపిటల్... ఆంధప్రదేశ్...అమరావతి

nris-candle-light-protest-for-amaravati-farmers
జులై 3 న చేయబోయే ప్రదర్శన కు పెరుగుతున్న ఎన్నారై ల మద్దతు
వన్‍ స్టేట్‍...వన్‍ క్యాపిటల్‍ నినాదంలో భాగంగా ఆంధప్రదేశ్‍కు అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలంటూ రాజధాని రైతులు చేస్తున్న పోరాటం 200 రోజులు అవుతున్న నేపథ్యంలో ప్రపంచంలోని తెలుగు ఎన్నారైలంతా అమరావతి రైతులకు మద్దతుగా జూలై 3వ తేదీన వెలుగుపూల సంఘీభావం (క్యాండిల్‍ లైట్‍ ప్రదర్శన) నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర చరిత్రలోనే కాదు...ప్రపంచ చరిత్రలో రాజధాని నిర్మాణానికి వివాద రహితంగా  భూసేకరణ జరిగిన ఏకైక ప్రాజెక్టు అమరావతి. అంతర్జాతీయ ప్రమాణాలతో గొప్ప నగరాన్ని నిర్మించుకుందాం అంటూ అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా అప్పటి ప్రభుత్వం ఎంపిక చేసింది. రాజధాని కట్టాక తొలి ప్రయోజనాలు మీకే ఇస్తాం అని ప్రభుత్వం అధికారికంగా భరోసా ఇవ్వడంతో వివాదరహితంగా వేల మంది రైతులు తమ భూములకు ఒక్కపైసా తీసుకోకుండా రాష్ట్రానికి ఇచ్చేశారు. ప్రభుత్వం మారిన వెంటనే వారి త్యాగం నిష్ఫలంగా మారింది. అప్పటివరకు వేగంగా సాగుతున్న అమరావతి రాజధాని నిర్మాణం  ఆగిపోయింది. తమతో పాటు అందరూ బాగుండాలని చేసిన రైతుల త్యాగం వృథా అయింది. మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి రైతులు నిరసనకు దిగారు. అలుపెరగకుండా పోరాడుతున్నారు. వారి పోరాటం 200 రోజులకు చేరుకుంది.
అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా ప్రపంచంలోని ఎన్నారైలను ఒక్కతాటిపైకి తెచ్చి వారికి మద్దతుగా వెలుగుపూల ప్రదర్శనకు అమెరికాలోని తెలుగు ప్రముఖులు జయరాం కోమటి ఇచ్చిన పిలుపునకు అన్నీచ్లో నుంచి మంచి స్పందన వచ్చింది. అమెరికా నుంచే కాకుండా ఆఫ్రికా, యూరప్‍, ఆస్ట్రేలియా ఖండాల నుంచి కూడా పలు నగరాల్లో స్థిరపడిన ఎన్నారైలు అమరావతి నిరసనకు మేము కూడా జైకొడతాం అని ముందుకువస్తున్నారు. 200 రోజులు పూర్తయిన సందర్భంగా అమెరికాలోని 200 నగరాల నుంచి జూమ్‍ కాల్‍ ద్వారా జులై 3 రాత్రి 9 గంటలకు క్యాండిల్‍ లైట్‍ నిరసన (వెలుగు పూల సంఘీభావం) తెలుపుదాం అని ఇచ్చిన పిలుపు 300 నగరాలకు చేరింది.అమరావతియే ఏపీ రాజధానిగా  రాష్ట్ర ప్రజలతోపాటు ప్రపంచంలోని ఎన్నారైలు ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థమవుతోంది. ఈ సంఘీభావ కార్యక్రమాల్లో పాల్గొంటున్నవారంతా కుల,మత, ప్రాంతాలకు అతీతంగా పాల్గొంటున్నారు.
ఈ కార్యక్రమంలో అమెరికాయేతర నగరాలను సతీష్‍ వేమన కోఆర్డినేట్‍ చేస్తుండగా... నాట్స్ తరఫున ఎన్నారై నేతలు డాక్టర్‍ మధు కొర్రపాటి, మోహన కృష్ణ మన్నవ, శ్రీధర్‍ అప్పసాని,  ఆప్టా తరఫున బాబు పత్తిపాటి, విజయ్‍ గుడిసేవ కీలకంగా పాలుపంచుకుంటున్నారు. రత్నప్రసాద్‍, ఠాగూర్‍, సాయి, చందు సోషల్‍ మీడియాలో ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరితోపాటు అమెరికా, ఇతర దేశాలలో దాదాపు 100 మంది ఆయా నగరాల కో ఆర్డినేటర్లుగా ఉంటూ ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలు, చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఉత్సాహంగా తమ మద్దతు తెలుపుతూ తమ పేర్లను నామినేట్‍ చేస్తున్నారు. కార్యక్రమ విజయవంతానికి అన్నిరకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈస్థాయిలో ఎన్నారైలందరూ ఏకమై నినదించడం గతంలో ఎన్నడూ జరగలేదు ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని అన్న నినాదంతో అందరూ ఒకేతాటిపైకి వస్తున్నారు.
కోవిడ్‍ నిబంధనలు పాటిస్తూన్ఱే ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. వివిధ నగరాల్లోని ఎన్నారైలు స్థానిక నిబంధనలు అనుసరిస్తూ ఒక్కోచోట 15-20 మందికి మించకుండా ఈ నిరసనలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.  కార్యక్రమానికి హాజరయ్యే వారంతా కచ్చితంగా నల్లటి మాస్క్ ధరించాలని, కోవిడ్‍ వల్ల ఇతరులతో కలవడానికి ఇబ్బంది పడే వారు కూడా నల్లటి మాస్క్ తో తమ ఇంట్లో నిరసన తెలిపి ఆ ఫొటోను సోషల్‍ మీడియాలో పోస్టు చేయాలని నిర్వాహకులు కోరారు.

మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు... ఈ లీకేజిలు ఏంటిరా బాబూ....

Dil Raju To Approach Cops For Vakeel Saab Leaks
తెలుగు చిత్ర పరిశ్రమలో మళ్ళీ లీకేజ్ వివాదాలు మొదలయ్యాయి. అసలే కరోనా కారణంగా సినిమాలను విడుదల నోచుకోలేక టాలీవుడ్ పరిస్థితి గందర గోళం గా మారింది మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు కొత్త సినిమాలకు సంబంధించిన సీన్స్ ఇంటర్నెట్ వరల్డ్ లో లీక్ చేస్తున్నారు కొందరు. అయితే ఇటీవల అలాంటి చేదు అనుభవం ఎదుర్కొన్న దిల్ రాజు విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన త్వరలోనే పోలీసులను కూడా కలవబోతున్నట్లు తెలుస్తోంది.
సోమవారం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కి సంబంధించిన ఒక సీన్ లీక్ అయిన విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇంటర్నెట్ లో బాగానే వైరల్ అయ్యాయి. అయితే ఆ లీకేజ్ ఎక్కువ సేపు వైరల్ అవ్వకముందే దిల్ రాజు టీమ్ జాగ్రత్త పడింది. ఆ వీడియో వైరల్ అవ్వకముందే ఫ్యాన్స్ సాయంతో అరికట్టారు. అయితే ఈ లీకేజ్ విషయంపై దిల్ రాజు చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అసలు దీనికి కారకులు ఎవరనే విషయం గురించి కనిపెట్టడంలో బిజీగా ఉన్నారు.
అలాగే దిల్ రాజు పోలీసులను సంప్రదించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు సిరియస్ గా తీసుకోకపోతే చాలా ప్రమాదమని దిల్ రాజు ఈ విధంగా అడుగులు వేస్తున్నారట. ఇప్పటికే షూటింగ్స్ పూర్తి చేయలేక సినిమా రిలీజ్ చేయలేక దిల్ రాజు చాలా ఇబ్బంది పడుతున్నాడు. లాక్ డౌన్ కారణంగా తుది దశలో ఉన్న వకీల్ సాబ్ షూటింగ్ తో పాటి దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతున్న మరికొన్ని సినిమాలు కూడా చాలా వరకు మధ్యలోనే ఆగిపోయాయు. నాని V సినిమా రిలీజ్ డేట్ గత కొన్ని నెలలుగా మారుతూనే ఉంది. ఇలాంటి కష్టకాలంలో దిల్ రాజుకి మళ్ళీ మరో దెబ్బ పడటం చర్చనీయాంశంగా మారింది. ఇక వకీల్ సాబ్ కి సంబంధించి ఇంకా 20శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేయాల్సి ఉందట. కరోనా లాక్ డౌన్ లేకపోయి ఉంటే.. ఇప్పటికే సినిమా రిలీజ్ అయ్యుండేది. ఇక థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. మరి వకీల్ సాబ్ రావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో చూడాలి..

‘సూర్యవంశీ’, ‘83’ చిత్రాలను థియేటర్ లోనే రిలీజ్ చేస్తాం - రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సీఇఓ


83 and suryavanshi release on theatre

రెండు భారీ చిత్రాలు ‘సూర్యవంశీ’, ‘83’ కోసం సినీ ప్రేక్ష‌కులు, అభిమానులు ఎంతో ఆతృత‌గా, ఆస‌క్తిగా ఎదురు చూశారు. కానీ క‌రోనా ప్ర‌భావంతో ఈ రెండు సినిమాల విడుద‌ల కాకుండా వాయిదా ప‌డ్డాయి. తాజాగా ఈ సినిమా విడుద‌ల తేదీల‌పై ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ క్లారిటీ ఇచ్చింది. 2020లో దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 13న అక్ష‌య్ హీరోగా న‌టించిన ‘సూర్య‌వంశీ’.. అలాగే క్రిస్మస్ సందర్భంగా డిసెంబ‌ర్‌25న‌ రణ్వీర్ సింగ్ ప్రధానపాత్రలో నటించిన ‘83’ సినిమాను విడుద‌ల చేస్తున్నట్లు రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సీఇఓ షిభాషిస్ స‌ర్కార్ తెలిపారు. ఆయ‌న మాట్లాడుతూ ‘‘నవంబర్ 13న దీపావళికి ‘సూర్యవంశీ’, క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ‘83’ చిత్రాలను థియేటర్స్‌లోనే విడుద‌ల చేస్తున్నాం. పరిస్థితులు చక్కబడి ప్రేక్ష‌కులు సినిమా థియేట‌ర్‌కు రావ‌డం ప్రారంభించిన త‌ర్వాతే ‘సూర్యవంశీ’, ‘83’ చిత్రాల‌ను విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాం. రానున్న దీపావళి, క్రిస్మస్‌ల‌కు ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌తాయ‌ని ఆశిస్తున్నాం. లాక్‌డౌన్ త‌ర్వాత రిలీజ్ డేట్స్‌ను అనౌన్స్ చేసిన చిత్రాలివే కావ‌డం గ‌మ‌నార్హం.
అక్ష‌య్‌కుమార్‌, క‌త్రినా కైఫ్‌, గుల్ష‌న్ గ్రోవ‌ర్ త‌దిత‌రులు న‌టించిన ‘సూర్య‌వంశీ’ చిత్రాన్ని రోహిత్ శెట్టి డైరెక్ట్ చేశారు. బాలీవుడ్‌లో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్స్ సింగం, సింబాలుగా ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ర‌ణ్వీర్ సింగ్ స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ ఇవ్వ‌డం విశేషం. మార్చి 27న విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. అలాగే క‌బీర్‌ఖాన్ తెర‌కెక్కించిన స్పోర్ట్స్ డ్రామా ‘83’ ఏప్రిల్ 10న విడుద‌ల కావాల్సింది. క‌రోనా ప్ర‌భావంతో ఈ చిత్రం కూడా వాయిదా ప‌డింది. 1983లో క్రికెట్‌లో విశ్వ‌విజేత‌గా ఆవిర్భ‌వించిన ఇండియ‌న్ టీమ్ ప్ర‌యాణాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇందులో ర‌ణ్వీర్ సింగ్‌, దీపికా, తాహిర్ రాజ్ బాసిన్‌, సాధిక్ స‌లీమ్‌, అమ్మి విర్క్‌, పంక‌జ్ త్రిపాఠి, బోమ‌న్ ఇరాని త‌దిత‌రులు న‌టించారు.

Saturday, June 27, 2020

ఏపీ సచివాలయ ఉద్యోగులకు తీపి కబురు

5 Days Working Extension for Secretariat Employees for One Year

ఆంధప్రదేశ్‍ సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఉద్యోగులకు వారానికి 5 రోజుల పనిదినాలను మరో ఏడాదిపాటు పొడిగించింది. వచ్చే ఏడాది వరకు పొడిగిస్తూ సీఎస్‍ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. నేటి నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సచివాలయం ఉద్యోగులు, అన్ని శాఖల హెచ్‍ఓడి కార్యాలయ ఉద్యోగులకు ఈ వెసులుబాటు వర్తించనుంది.

బొమ్మ ఆడలేదు కానీ థియేటర్ లో 100 రోజులు సీటులే ప్రేక్షకులు


Theaters running unsuccessful 100 days
రన్నింగ్ ఆన్ సక్సెస్ ఫుల్ 100 డేస్!   థియేటర్ సీట్లే ప్రేక్షకులు  
థియేటర్ లో ఒక సినిమా కంటిన్యూ గా 100 రోజులు ఆడితే అది రికార్డు గా పరిగణించి, ఆయా హీరోల అభిమానులు థియేటర్ వద్ద సంబరాలు చేసుకునే వారు.  ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి విజృభిస్తున్న తరుణంలో  బొమ్మ ఆడలేదు కానీ థియేటర్ లో  100 రోజులు సీట్లు ప్రేక్షకులయ్యాయి   మునుపెన్నడూ లేని విధంగా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ప్రపంచ సినిమా పరిశ్రమ ఓ విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్నది. వందేళ్లకుపైగా సినిమా చరిత్రలో 100 రోజులుపాటు సినీ థియేటర్లు మూతపడిన దాఖలాలు లేవు. కరోనావైరస్ కారణంగా సినీ పరిశ్రమ, కార్మికులు, నటులు, నిర్మాతలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కరోనా పరిస్థితులు చక్కబడితే మళ్లీ సినిమా పరిశ్రమను పూర్వ వైభవం వైపు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. గత 100 రోజుల్లో సినీ పరిశ్రమలో చోటుచేసుకొన్న పరిణామాలు ఏమిటంటే..
తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రాణాంతక వ్యాధిని నివారించేందుకు లాక్‌డౌన్ ప్రకటించారు. ఈ క్రమంలోనే మార్చి 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్లలో సినిమా ప్రదర్శనలు నిలిపివేశారు. దాంతో సినీ ప్రేక్షకుల వినోదానికి బ్రేక్ పడింది. రెండు వారాల గడువుతో మొదలైన లాక్‌డౌన్ ఇప్పటికి 100 రోజులకు చేరుకొన్నది.
కరోనా వైరస్ పరిస్థితులు తీవ్రతరం కావడంతో సినిమా షూటింగులు నిలిపివేశారు. టెలివిజన్ సిరియల్స్, షోల షూటింగ్స్ స్టార్ట్ అయినా  అంతరాయం ఏర్పడింది. రోజువారి వేతన కార్మికుల జీవితం సందిగ్గంలో పడింది. పలు సినిమాల రిలీజ్‌లు ఆగిపోయాయి. దాంతో సినీ పరిశ్రమ కూడా ఇప్పటి వరకు చూడని దారుణమైన పరిస్థితి చూడాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా పలు భాషల సినిమా పరిశ్రమల్లో సహాయక చర్యలు ఊపందుకొన్నాయి. బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, తదితర నటులు ముందుకొచ్చి విరాళాలు ప్రకటించారు. ఇక టాలీవుడ్‌లో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఏర్పాటైంది. దాంతో ఇండస్ట్రీలోని వేతన కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణి, సహాయ కార్యక్రమాలు రెండు సార్లు  నిర్విరామంగా కొనసాగించాయి.  
సినిమా థియేటర్లు మూత పడటంతో వాటి స్థానంలోకి అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5, ఆహా లాంటి ఓటీటీ ఫ్లాట్‌ఫాంతోపాటు మరికొన్ని కొత్తగా పుట్టుకొచ్చాయి. రిలీజ్‌కు సిద్దమై ఆగిన సినిమాలన్నీ ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. అమృత రామం,  అమితాబ్ నటించిన గులాబో సితాబో, జ్యోతిక నటించిన పోంమగాళ్ వండాల్, కీర్తీ సురేష్ నటించిన పెంగ్విన్, ఇటీవల కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 47డేస్ జూన్ 30న, భానుమతి రామకృష్ణ జులై 3న  ఇంకా కొన్ని రిలీజ్‌కు క్యూ కట్టాయి. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత సినీ అగ్రతారలు, నిర్మాతలు కలిసి ప్రభుత్వాలతో చర్చలు జరిపారు. షూటింగులతోపాటు సినిమాల ప్రదర్శనకు థియేటర్లను ఓపెన్ చేయాలని సర్కార్లకు విన్నపాలు చేశారు. ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందించి షూటింగులకు అనుమతులు ఇచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో షూటింగుల కదలిక మొదలైంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఊహించని విధంగా కరోనా కేసులు పెరిగిపోవడంతో షూటింగులకు యూనిట్లు ముఖం చాటేస్తున్నాయి.  కానీ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇప్పుడిప్పుడే సినిమా థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. ఆట ఆటకు థియేటర్ శానిటైజ్ చేసి సీట్ సీటుకు గ్యాప్ ఏర్పాటు చేసి   న్యూజిలాండ్, దుబాయ్ లాంటి దేశాల్లో పరిస్థితులకు అనుగుణంగా థియేటర్లలో ప్రదర్శనలు ప్రారంభమైనప్పటికీ ప్రేక్షకులు థియేటర్కి రావడానికి సముఖంగా లేరు.  

క్యాట్స్ ఆధ్వర్యంలో కళాసంజీవని

CATS 15th Anniversary Celebrations Kala Sanjivani
రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (CATS) 15వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని జూన్‍ 21 నుంచి ఆగస్టు 30 వరకు ప్రతీ శనివారం, ఆదివారాల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కళా సంజీవని పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమాల్లో భాగంగా జూన్‍ 27వ తేదీన అన్నమయ్య కీర్తనలకు చిత్ర కళార్చన పేరుతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మధురగాయక రామానుజ సంకీర్తన ప్రచారక పడాల తారకరామారావు గారి అన్నమయ్య కీర్తనలకు ప్రముఖ చిత్రకారుడు, నంది అవార్డు గ్రహీత కూచి చిత్రలేఖనం కార్యక్రమం 27వ తేదీన నిర్వహిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 8.30 నుంచి 10.30 వరకు జరుగుతుంది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం జరుగుతుందని క్యాట్స్ అధ్యక్షురాలు సుధ కొండపు తెలిపారు.
జూన్‍ 28వ తేదీన ఆదివారంనాడు హరికథా చూడామణి, ప్రముఖ హరికథా భాగవతారిణి, నటి, గాయని శ్రీమతి  పడాల కల్యాణి(కరాటే కళ్యాణి) ‘హరికథా గానం’ ఏర్పాటు చేశారు. విశ్వామిత్ర యాగరక్షణ అంశంపై ఈ కార్యక్రమం జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 8.30 నుంచి 10.30 వరకు జరుగుతుంది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని లైవ్‍లో ఈ కింది లింక్‍ ద్వారా చూడవచ్చు.

తానా సాంస్కృతికోత్సవం...భారీ వేడుకలకు సన్నాహాలు

TANA World Telugu Cultural Festival on July 24th, 25th and 26th

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) భారీ ఎత్తున ప్రపంచ తెలుగు సాం స్కృతిక మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తెలుగు భాషా వైభవాన్ని చాటేందుకు ప్రపంచంలోని తెలుగుఅసోసియేషన్లతో కలిసి ఈ వేడుకను నిర్వహిస్తున్నట్లు తానా అధ్యక్షుడు జయ్‍ తాళ్ళూరి, కార్యదర్శి రవి పొట్లూరి చెప్పారు. దాదాపు 50కిపైగా తెలుగు అసోసియేషన్లు ఈ వేడుకల్లో పాలుపంచుకుంటున్నాయని వారు తెలిపారు. ఈ వేడుకలను పురస్కరించుకుని వివిధ అంశాలపై కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సౌందర్యలహరి, తెలుగు వెలుగు, రాగమంజరి, నాదామృతం, అందెల రవళి, కళాకృతి, రంగస్థలం, భువనవిజయం పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తెలుగు వెలుగు పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో తెలుగుపద్యాలు, సామెతలు వివరణ, పరభాష లేకుండా తెలుగు పలుకు, తెలుగు కవితాగానం, చందమామ రావే కథలు ఉన్నాయి. రాగమంజరి పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జానపద, శాస్త్రీయ సంగీతాలు, సినిమా, లలిత గీతాలు ఉన్నాయి. నాదామృతం పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వయోలిన్‍, తబల, వీణ, కీ బోర్డ్, మృదంగం, ఫ్లూట్‍ వంటివి ఉన్నాయి. అందెల రవళి పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో జానపద, శాస్త్రీయ, పాశ్చాత్య నృత్యాలు మొదలైనవి ఉన్నాయి. కళాకృతి పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏకపాత్రాభినయం, మూకాభినయం, ఇద్దరు లేదా ముగ్గురితో సన్నివేశ నటన వంటివి ఉన్నాయి.
ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఈ కింది ఫోన్‍ నెంబర్‍లో, లేదా ఇ-మెయిల్‍లో సంప్రదించవచ్చు.
వంశీ- 860 805 5406
worldteluguculturalfest@tana.org 

Tuesday, June 23, 2020

సరికొత్త హంగులతో 'నీకోసం నిరీక్షణ'

Kamal Hassan Rajinikanth Sridevi s Classic Remastered Version In Telugu Titled Nee Kosam Neereekshana s Ready To Release

భార‌తీయ చ‌ల‌న‌చిత్ర రంగంలో నటదిగ్గజాలు అయినటువంటి యూనివ‌ర్స‌ల్ హీరో కమల్ హాసన్, సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు అందాల తార శ్రీదేవి నటీనటులుగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు భారతీరాజా దర్శకత్వం వహించిన చిత్రం "పదినారు వయదినిలే`‌. 70వ ద‌శ‌కంలో విడుదలైన ఈ చిత్రం ఎన్నో అవార్డుల‌తో పాటు ప్రేక్షకుల మన్ననలతో ఘనవిజయం సాధించి క్లాసిక్ మూవీగా నిలిచింది. తెలుగులో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీదేవి, చంద్ర మోహన్, మోహన్ బాబులతో 'పదహారేళ్ళ వయసు' గా రూపొందించబడి సూపర్ హిట్ గా నిలిచింది. 42 సంవత్సరాల తర్వాత తమిళ "పదినారు వయదినిలే" చిత్ర నిర్మాత ఎస్ ఏ రాజ్ కణ్ణు కుమార్తె బామ రాజ్ కణ్ణు తమిళ వెర్షన్ ను అధునాతన డాల్బీ సౌండ్ పద్ధతుల్లో తెలుగు భాషలోకి అనువదించి, డిజిటలైజ్ చేసి తెలుగులో `నీకోసం నిరీక్షణ` టైటిల్ తో విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఆన్ లైన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన అనంత‌రం మ‌రో నాలుగు భాషల్లో డ‌బ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్లు సుప్రీమ్ ఆల్మైటీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ సంద‌ర్భంగా..
నిర్మాత బామా రాజ్ కణ్ణు మాట్లాడుతూ - "40 ఏళ్ళ క్రితం మా నాన్నగారు నిర్మించిన క్లాసిక్ ను తెలుగు వారికి అందించాలనే నా ప్రయత్నమే `నీ కోసం నిరీక్షణ`. ఒక అరగంట నిడివి గల చిత్రాన్ని ఎడిట్ చేసి డబుల్ సెన్సార్ చేశాం. రజినీకాంత్, కమల్ హాసన్, శ్రీదేవి నటించిన ఈ చిత్రం స్ట్రెయిట్ తెలుగు సినిమా లానే ఉంటుంది. అయితే ` నీ కోసం నిరీక్షణ` క్లైమాక్స్ తెలుగు రీమేక్ `పదహారేళ్ళ వయసు` కి భిన్నంగా ఉంటుంది. కొత్త సంగీత దర్శకుడు కె. కె అందించిన 5 సరికొత్త పాటలు మిమ్మ‌ల్ని అల‌రిస్తాయి. ఇళయరాజా గారి రీ- రికార్డింగ్ ను యధాతథంగా ఉపయోగించాం. ఈ చిత్ర డిజిటల్ రీ-స్టోరేష‌న్ ప్రాసెస్ కారణంగా డబ్బింగ్ చిత్రానికి అయ్యే ఖర్చు కంటే మూడు రెట్లు ఎక్కువ అయింది. రజినీకాంత్ గారు ఆర్థికంగా సహాయం చేశారు. కరోనా కారణంగా ప్రివ్యూ వేయడం కుదరలేదు. వారికి స్పెషల్ షో ఏర్పాటు చేస్తున్నాం.
ఒరిజినల్ నెగెటివ్ నుండి లాబ్ టెక్నీషియన్స్ ఒక్కో ఫ్రేమ్ ను జాగ్ర‌త‌గా కలర్ ఎన్‌హ్యాన్స్‌ చేసి సినిమాస్కోప్ లోకి మార్చ‌డం జ‌రిగింది. ముగ్గురు ఆడియోగ్రాఫర్లు ఎంతో శ్ర‌మించి సౌండ్ ను లేటెస్ట్ డాల్బీ 5.1 లో రికార్డ్ చేశారు. హీరో, విలన్ పాత్ర‌ల‌కు ఒక్క‌రే డ‌బ్బింగ్ చెప్పినా అలా అనిపించదు. అంత బాగా చెప్పారు. మొద‌ట ఈ చిత్రాన్ని 1000 థియేటర్లలో విడుదల చేద్దాం అనుకున్నాం కానీ ప్రస్తుత కరోనా కారణంగా డైరెక్ట్ గా ఆన్ లైన్లో విడుదల చేస్తున్నాం" అన్నారు.
ఈ చిత్రానికి.. సంగీతం : ఇళ‌య‌రాజా, నిర్మాత‌: బామా రాజ్ కణ్ణు, ద‌ర్శ‌క‌త్వం: భారతీరాజా.

డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన గూగుల్ సీఈవో

disappointed-says-google-ceo-sundar-pichai-on-h1-b-visa-ban

హెచ్‍ 1బీ వీసాల జారీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ తీసుకొన్న కొత్త నిర్ణయాన్ని గూగుల్‍ సీఈవో సుందర్‍ పిచాయ్‍ వ్యతిరేకించారు. ఈ ఏడాది చివరివరకూ వలసదార్ల వీసాలను తాత్కాలికంగా రద్దు చేయడం సరైన నిర్ణయం కాదన్నారు. అమెరికా వలసదార్ల వీసాలకు సంబంధించి శ్వేతసౌధం కీలక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పిచాయ్‍ ఆ ప్రకటనను ఖండిస్తూ ఓ ట్వీట్‍ చేశారు. అమెరికా ఆర్థిక బలోపేతానికి వలసవిధానమే విశేషంగా కృషి చేసిందని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టిందని చెప్పారు. అలాగే గూగుల్‍ ఇప్పుడున్న స్థితికి కూడా ఆ విధానమే కారణమని పేర్కొన్నారు. కొత్త నిర్ణయంతో తీవ్ర నిరాశకు గురైనట్లు ఆయన విచారం వ్యక్తం చేశారు. వలసదార్లకు తాము అండగా ఉంటామని, అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

తాజా కొత్త అధ్యక్షుడిగా పాపారావు గుమ్మడపు

Telugu Association of Jacksonville Area New Committee Members
జాక్సన్‍విల్‍ తెలుగు అసోసియేషన్‍ (తాజా) కొత్త అధ్యక్షుడిగా పాపారావు గుమ్మడపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాజా వేదిక ద్వారా మరిన్ని చక్కటి కార్యక్రమాలకు రూపకల్పన చేసి అందరి సహకారంతో నిర్వహించనున్నట్లు చెప్పారు. కరోనా మహమ్మారి జనజీవితాలను నాశనం చేస్తున్న సమయంలో అందరం జాగ్రత్తగా ఉంటూ, తెలుగువాళ్ళకు ఏ అవసరం వచ్చినా, కష్టం వచ్చినా తాజా తరపున సహాయ సహకారాలను అందిస్తామని ఆయన హామి ఇచ్చారు. తెలుగు యువతకు మార్గనిర్దేశం చేస్తూ, మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
కొత్త తాజా కార్యవర్గం 2020-21 వివరాలు...
 పాపారావు గుమ్మడపు (ప్రెసిడెంట్‍), లక్ష్మీ సతీష్‍కుమార్‍ (వైస్‍ప్రెసిడెంట్‍), శంకర కుప్ప (ట్రెజరర్‍), వసుంధర శ్రీకాకుళపు (సెక్రటరీ), సురీష్‍ గుడిమెట్ల (ఆపరేషన్స్ -విపి), సురేష్‍ మిట్టపల్లి (ప్రెసిడెంట్‍ ఎలక్ట్), శ్రీనివాస రవి (యూత్‍ కమిటీ చైర్‍), లత కోట (యూత్‍ కమిటీ కో చైర్‍), మహేష్‍ బాబు గునుకుల (తెలుగు బడి చైర్‍), సంధ్య ఈశ్వర (కల్చరల్‍ చైర్‍), శ్వేత శరభన్న (కమ్యూనికేషన్స్ చైర్‍), సుమన్‍ సజ్జన్న (ఎవి చైర్‍), నవీన్‍ మొదలి (పిఆర్‍ చైర్‍), సునీల్‍ మెరుగు(వెబ్‍ చైర్‍), మాధవి (సంక్రాంతి చైర్‍), శిరీష పాలకల్లూరి (సంక్రాంతి కో చైర్‍), పద్మ ప్రియ కొల్లూరు (ఉగాది చైర్‍), సమత చంద్ర (ఉగాది కో చైర్‍), పున్నయ్య శాస్త్రి జంధ్యాల (స్పోర్టస్ చైర్‍), రాజ్‍ బండారు (స్పోర్టస్ కో చైర్‍), నారాయణ కసిరెడ్డి (ఫుడ్‍ చైర్‍), రామకృష్ణ (ఆపరేషన్స్ - చైర్‍), కావ్య పాలరపు(ఈవెంట్స్ డెకరేషన్స్ - చైర్‍), శ్రీధర్‍ కండే (ఆపరేషన్స్ - కో చైర్‍).

యాక్ష‌న్‌ హీరో విశాల్ 'చ‌క్ర' ఫ‌స్ట్ లుక్‌, గ్లింప్స్ ఆఫ్ ట్రైల‌ర్ విడుద‌ల‌


Vishal s Chakra first look released

యాక్ష‌న్‌ హీరో విశాల్ హీరోగా ఎం.ఎస్ ఆనంద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న లేటెస్ట్ మూవీ `చ‌క్ర‌`. విశాల్ ఫిలిం ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  శ్ర‌ద్దా శ్రీ‌నాథ్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా కీల‌క పాత్ర‌లో రెజీనా క‌సాండ్ర న‌టిస్తోంది. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మ‌నోబాలన్‌, రోబో శంక‌ర్‌, కెఆర్ విజ‌య్, సృష్టిడాంగే ఇత‌ర పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు.  కాగా  కాసేప‌టి క్రితం `చ‌క్ర`‌ తెలుగు వెర్ష‌న్‌కి సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌‌ల చేశారు యాక్ష‌న్ హీరో విశాల్.  ప‌వ‌ర్‌ఫుల్ ‌లుక్‌లో ఉన్న ఈ పోస్ట‌ర్ కి మంచి  రెస్పాన్స్ వ‌స్తోంది. తాజాగా  జూన్ 22 సాయంత్రం 5 గంట‌ల‌కు `చ‌క్ర` గ్లింప్స్ ఆఫ్ ట్రైల‌ర్ పేరుతో వీడియో విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

విశాల్ సూప‌ర్ హి‌ట్ మూవీ  `అభిమ‌న్యుడు` త‌ర‌హా బ్యాంక్ రాబ‌రీ, సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో అత్యుత్త‌మ సాంకేతిక విలువ‌ల‌తో కొత్త క‌థ-క‌థనాల‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ వీడియోలో విశాల్  ప‌వ‌ర్‌ఫుల్  మాస్ లుక్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.
యాక్ష‌న్ హీరో విశాల్‌,  శ్ర‌ద్దా శ్రీ‌నాథ్, రెజీనా క‌సాండ్ర,మ‌నోబాలా, రోబో శంక‌ర్‌, కెఆర్ విజ‌య్, సృష్టిడాంగే త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి : బాల‌సుబ్ర‌మ‌నియం‌, సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా, నిర్మాత: విశాల్‌, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: ఎం.ఎస్ ఆనంద‌న్.
https://youtu.be/DhIqvIJC4A8



నాట్స్ పద్య సంగీత విభావరి కి మంచి స్పందన


nats-telugu-padya-sangeetha-vibhavari-by-dr-gunmadi-gopala-krishna

భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో అమెరికాలో తెలుగు ప్రజలకు సేవలందిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. ఆన్‍లైన్‍లో పద్య సంగీత విభావరి నిర్వహించింది. ప్రముఖ రంగస్థల నటులు గుమ్మడి గోపాలకృష్ణ చే నాట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. తెలుగు పద్యాల్లోని మాధుర్యాన్ని గుర్తు చేసేలా గుమ్మడి గోపాలకృష్ణ పద్య సంగీత విభావరి కొనసాగింది. నాట్స్ నాయకులు డాక్టర్‍ సూర్యం గంటి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహారించారు. నాట్స్ మాజీ ఛైర్మన్‍ డాక్టర్‍ మధు కొర్రపాటి, నాట్స్ వైస్‍ ఛైర్మన్‍ అరుణ గంటి ఈ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.
అమెరికాలోని తెలుగువారు ఆన్‍లైన్‍ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. రంగస్థల నటులు గుమ్మడి గోపాలకృష్ణ.. శ్రీనాథుడు, అల్లసాని పెద్దన్న పద్యాలను రాగయుక్తంగా ఆలపించారు. హరిశ్చంద్ర, చింతామణి నాటక పద్యాలను కూడా ఎంతో శ్రావ్యంగా ఆలపించి తెలుగు భాషలోని మథురిమల గొప్పతనాన్ని చాటారు. తెలుగు పద్యాలు పాడటం భావ వ్యక్తీకరణకు ఎంతో దోహదం చేస్తుందని రంగస్థల నటులు గుమ్మడి గోపాలకృష్ణ తెలిపారు. ఏ విషయాన్నైనా స్పష్టంగా చెప్పగలిగేందుకు కూడా పద్యగానం తోడ్పడుతుందన్నారు. ఏ దేశమేగినా మాతృభాషను మరిచిపోరాదని అన్నారు.  తులభారం  నాటక పద్యాలను ప్రముఖ రంగస్థల నటీమణి రత్నశ్రీ ఆలపించి శ్రోతలను ఆకట్టుకున్నారు.
దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ పద్య సంగీత విభావరి ఆద్యంతం ఆకట్టుకునే విధంగా సాగింది. అమెరికాలో ఉంటున్న తెలుగువారికి ఈ కార్యక్రమం తెలుగు పదాలు, పద్యాలను గుర్తు చేసింది. శ్రీధర్‍ అప్పసాని మాట్లాడుతూ.. వీక్షకుల కోరిక మేరకు త్వరలో ఈ కార్యక్రమం పార్ట్ 2 కూడా చేయాలని గోపాల కృష్ణ గారిని కోరారు. గోపాల కృష్ణ మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజ•ంభించి పేద కళాకారుల జీవనానికి ఆటంకంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకోవలసిందిగా కోరారు. డా. మధు కొర్రపాటి మాట్లాడుతూ చిన్న పిల్లలతో, నూతన కళాకారులతో కూడా మున్ముందు మంచి కార్యక్రమం చేయాలని కోరారు. పేద కళాకారుల భ•తి కోసం, గుమ్మడి గోపాల కృష్ణ ఫౌండేషన్‍ ద్వారా ఈ కళాభివృద్దికి తమ వంతు సహాయ సహకారాలు అందించటానికి నాట్స్ ఎప్పుడూ ముందుంటుందని వివరించారు శ్రీధర్‍.  తెలుగు భాష వికాసం కోసం నాట్స్ ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని నాట్స్ ఛైర్మన్‍ శ్రీథర్‍ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్‍ శ్రీనివాస్‍ మంచికలపూడి తెలిపారు.