ఆంధప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి ఈ నెల 18న జాతికి అంకితం చేయనున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. ఇందులో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్ ఒకటని ఆయన పేర్కొన్నారు. రూ.7,584 కోట్ల వ్యయంతో 877 కిలోమీటర్ల మేర నిర్మించనున్న 16 ప్రాజెక్టుల భూమిపూజ కార్యక్రమలో ఢిల్లీ నుంచి నితీన్ గడ్కరీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారని తెలిపారు. రూ.8038 కోట్ల వ్యయంతో 533 కిలోమీటర్ల మేర ఆరు, నాలుగు, రెండు వరుసలుగా విస్తరించిన రహదార్లను జాతికి అంకితం చేస్తారన్నారు. రూ.146 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రూ.501 కోట్లతో అత్యాధునికంగా నిర్మించిన ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఒకటని ఆయన తెలిపారు. దేశంలోనే ఆరు వరుసల నిర్మాణం చేసిన అత్యాధునిక బ్రిడ్జీల్లో ఇదొకటని ఆయన పేర్కొన్నారు.
No comments:
Post a Comment