ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క రోజే 59,919 పరీక్షలు నిర్వహించగా, 10,776 మందికి పాజిటివ్గా తేలింది. ఇప్పటి వరకూ మొత్తం 39,65,694 మందికి పరీక్షలు చేయగా, మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 4,76,506కి చేరింది. గడిచిన 24 గంటల్లో 12,334 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకూ 3,70,163 మంది కోలుకున్నారు. తాజాగా 76 మంది మృతితో మొత్తం మరణాలు 4,276కి చేరినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్లో పేర్కొంది. యాక్టివ్ కేసులు 1,02,067 ఉన్నాయి.
No comments:
Post a Comment