బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగిపోయి అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారీ బడ్జెట్తో రూపొందిన సాహో కూడా పలు భాషల్లో విడుదలైంది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న రాధేశ్యామ్ కూడా భారీ చిత్రంగానే రూపొందుతోంది. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ సినిమా చేస్తున్నట్టు అశ్వనీదత్ ప్రకటించారు. సోషియో ఫాంటసీగా రూపొందే ఈ సినిమాను భారీ బడ్జెట్తో రూపొందించనున్నారు. ఈ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేను ఎంపిక చేశారు. రాధేశ్యామ్ తర్వాత ఈ సినిమా ప్రారంభం అవుతుంది. ఈలోగా ప్రభాస్, ఓం రౌత్ కాంబినేషన్లో ఆదిపురుష్ ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ కూడా నటించడం విశేషం. అయితే నాగ్ అశ్విన్ సినిమా పూర్తయిన తర్వాతే ఆదిపురుష్ సెట్స్ పైకి వెళ్తుంది. ఇదిలా ఉంటే ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా కోసం ఇచ్చిన అడ్వాన్స్ను దీపికా పదుకొనే వెనక్కి ఇచ్చేసిందని ప్రచారం జరుగుతోంది. అంటే దీపిక ఈ సినిమా చేయడం లేదా అనే అనుమానాలు అందర్నీ వెంటాడుతున్నాయి. ఆమె అడ్వాన్స్ వెనక్కి ఇచ్చెయ్యడానికి మరో కారణం ఉందట.
రాధేశ్యామ్ తర్వాత నాగ్ అశ్విన్ సినిమా మొదలవుతుందని అందరూ భావిస్తున్నప్పటికీ.. ఆదిపురుష్ మొదట లైన్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే నాగ్ అశ్విన్ సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని సినిమా మొదలైనప్పుడే అడ్వాన్స్ తీసుకోవాలని భావిస్తోందట. దానివల్ల నిర్మాతపై భారం పడకుండా ఉంటుందని ఆమె ఆలోచనట. మంచి స్టార్డమ్ ఉన్న హీరోయిన్ అలాంటి ఓ మంచి ఆలోచన చేయడం నిజంగా గ్రేట్ అని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఒక్కసారి అడ్వాన్స్ తీసుకుంటే సినిమా చేసినా చెయ్యకపోయినా వెనక్కి ఇవ్వని హీరోయిన్లు ఉన్న ఈరోజుల్లో దీపికా పదుకొనే వంటి హీరోయిన్లు కూడా ఉండడం సంతోషించాల్సిన విషయమే.
No comments:
Post a Comment