Wednesday, September 2, 2020

మాస్క్ తో 2 లక్షల మరణాలకు చెక్

 

Mask Use and Social Distancing May Prevent 2 Lakh Covid 19 Deaths

ప్రజలు ఆరోగ్యస్పృహతో మాస్క్లు వాడి, భౌతికదూరాన్ని తు.చ తప్పకుండా పాటిస్తే డిసెంబరుకల్లా భారత్‍కు 2 లక్షల కరోనా మరణాల గండం తప్పుతుందని అమెరికాలోని వాషింగ్టన్‍ వర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. దేశ జనాభాలో సింహబాగం ప్రజలు ఇంకా ఇన్ఫెక్షన్‍ గండానికి చేరువలోనే ఉన్నారని హెచ్చరించింది. డిసెంబరు మొదటివారం నుంచి మూడోవారం కల్లా భారత్‍లో కరోనా కేసులు పతాక స్థాయికి చేరొచ్చని అంచనా వేసింది. ఇన్ఫెక్షన్లు ఇదే రీతిలో పెరుగుతూపోతే. ఆ సమయానికి ప్రతిరోజు 60 లక్షల కేసులు నమోదయ్యే అవకాశాలు ఉండగా, అప్పటికి మొత్తం మరణాల సంఖ్య 5 లక్షలకు చేరొచ్చని పేర్కొంది. ఒక వేళ పరిస్థితులు అదుపులోకి వచ్చి, ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడితే.. డిసెంబరు 1 కల్లా మరణాలు 2.91 లక్షలకే పరిమితం కావచ్చని ప్రస్తావించింది. కేసులు, మరణాలపై గతంలో వచ్చిన నివేదికల గణాంకాలతో పోలిస్తే, ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయని హరియాణాలోని అశోకా వర్సిటీ ప్రొఫెసర్‍ గౌతమ్‍ మీనన్‍ అభిప్రాయపడ్డారు.

No comments:

Post a Comment