Wednesday, September 2, 2020

ముగిసిన ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు

 Former President Pranab Mukherjee Funeral


మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్‍ ముఖర్జీ అంతిమ యాత్ర ముగిసింది. లోధి స్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. సైనిక లాంఛనాలతో ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు. ప్రణబ్‍ అంత్యక్రియలను ఆయన కుమారుడు అభిజిత్‍ ముఖర్జీ నిర్వహించారు. కరోనా ప్రోటోకాల్‍ ప్రకారం పరిమిత సంఖ్యలో జనాభాను అనుమతించారు. అంతకు ముందే రాష్ట్రపతి రామ్‍నాథ్‍ కోవింద్‍, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆశ్రునయనల మధ్య ఆయనకు వీడ్కోలు పలికారు. కరోనాతో పోరాడి ప్రణబ్‍ ముఖర్జీ తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment