అన్లాక్ 4 నిబంధనలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. సెప్టెంబర్ 30వ తేదీ వరకు అన్లాన్ 4 నియామావళిని పాటించాల్సి ఉంటుంది. కేంద్ర హోంశాఖ ఆన్లాక్ 4 మార్గదర్శకాలను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కొత్త మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్ 7వ తేదీ నుంచి మెట్రో సర్వీసులను దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నారు. స్కూళ్లు, కాలేజీలు మాత్రం బంద్ చేసి ఉంటాయి. మతపరమైన, రాజకీయ, సామాజిక, క్రీడా సమావేశాలకు వందకు మించి జనం హాజరుకావద్దు అంటూ అనుమతి ఇచ్చింది. అయితే సెప్టెంబర్ 21వ తేదీ నుంచి ఈ నిబంధన వర్తిస్తుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులు ఈ నెల చివర వరకు నిలిపివేశారు. కేవలం అనుమతి ఉన్న విమనాలకే ప్రయాణం ఉంటుంది. అంతర్ జిల్లా, అంతర్ రాష్ట్ర ప్రయాణాలకు అనుమతి అవసరం లేదు. కంటోన్మెంట్ కాని ప్రాంతాల్లో లాక్డౌన్ అమలు చేయకూడదని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం జారీ చేసింది.
No comments:
Post a Comment