Wednesday, September 2, 2020

అమెరికాలో హింసాత్మకంగా మారిన నిరసనలు

 

Protests continue over Jacob Blake shooting

నల్లజాతీయుడు జాక్‍బో బ్లేక్‍పై పోలీసుల కాల్పులకు నిరసనగా అమెరికాలో జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. బ్లేక్‍పై కాల్పులకు నిరసనగా పోర్ట్ లాండ్‍లో ప్రజలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో ట్రంప్‍ మద్దతుదారులు ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తూ అటు వైపు రావడంతో ఒక్కసారిగా ఉద్రికత్త ఏర్పడింది. పర్యవసానంగా ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన ట్రంప్‍ మద్దతు దారుడు ఒకరు మరణించారు. మరో వైపు ఆందోళనల్లో మరణించిన వ్యక్తి తన మద్దతుదారుడని తెలిపిన అధ్యక్షుడు ట్రంప్‍ డెమొక్రటిక్‍ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ పార్టీకి చెందిన పోర్ట్లాండ్‍ మేయర్‍ డెటా వీలర్‍పై విరుచుకుపడ్డారు.

జో బైడెన్‍, టెడ్‍ వీలర్‍ ఇద్దరూ దొందూ దొందేనని విమర్శించారు. శాంతి భద్రతల్ని కాపాడడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. అవసరం అనుకుంటే బలగాల్ని రంగంలోకి దించుతామని హెచ్చరించారు. ట్రంప్‍ వ్యాఖ్యలపై డెమొక్రటిక్‍ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‍ కూడా దీటుగా స్పందించారు. ట్రపే హింసను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న వారిపై వాహన శ్రేణితో దూసుకువెళ్లడమే కాక, వారిని దేశభక్తులుగా అభివర్ణిస్తారా అని మండిపడ్డారు.

No comments:

Post a Comment