Wednesday, September 2, 2020

తొలిసారి బాలాపూర్ లడ్డూ వేలంపాట రద్దు

 

Balapur laddu 2020 auction cancelled

బాలాపూర్‍ లడ్డూ వేలం పక్రియ ఈ దఫా రద్దైంది. గణేష్‍ ఉత్సవ కమిటీ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది లడ్డూ వేలంపాటను రద్దు చేసినట్టు ప్రకటించింది. బాలాపూర్‍లో ఈ దఫా వేలం పాట లేకుండానే గణేష్‍ శోభయాత్ర ప్రారంభమైంది. ప్రత్యేక పూజల తరువాత మండపం నుంచి బాలాపూర్‍ గణపయ్య బయలుదేరారు. ఈ కార్యక్రమం గురించి ఎప్పుడు, ఎక్కడ చర్చకు వచ్చినా, అందరి దృష్టి లడ్డూ ధర పైనే ఉంటుంది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో బాలాపూర్‍ గణేష్‍ ఉత్సవ కమిటీ లడ్డూ వేలం పక్రియను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ వేలంపాటను ఈ ఏడాది రద్దు చేసినట్టు తెలిపింది.

బాలాపూర్‍ గణేష్‍ వేలంపాట 1994లో మొదలుకాగా, లడ్డూ వేలం పక్రియను నిలిపివేయడం ఇదే తొలిసారి. కాగా, 1994లో తొలి ఏడాది రూ.450కు బాలాపూర్‍ గణపయ్య లడ్డూను కొలను మోహన్‍ రెడ్డి సొంతం చేసుకోగా, గతేడాది (2019లో) కొలను రాంరెడ్డి అనే భక్తుడు రూ.17.60 లక్షల రకార్డు ధరకు బాలాపూర్‍ లడ్డూను వేలంలో సొంతం చేసుకోవడం తెలిసిందే.

No comments:

Post a Comment