Wednesday, September 2, 2020

కొనోషాలో మితవాత హింసను సమర్థించిన ట్రంప్

 

Trump to visit Kenosha despite objections of local officials

గతవారం కొనోషాలో పోలీసుల హింసకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న ఇద్దరు వ్యక్తులను మితవాత గన్‍మెన్‍ కాల్చిచంపడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ సమర్థించుకున్నారు. స్వీయ రక్షణ కోసమే అతను కాల్పులు జరిపాడని ట్రంప్‍ ఉద్ఘాటించారు. నిరసనకారుల నుంచి తప్పించుకోవడానికి అతను పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతను పడిపోయాడు. వారందరూ అతనిపై హింసాత్మకంగా దాడి చేయబోయారు అని ట్రంప్‍ చెప్పారు. అతను పెద్ద ఆపదలో ఉన్నాడని నేను ఊహిస్తున్నాను. అతను ఖచ్చితంగా హత్యకు గురికాబడి ఉండేవాడు అని ట్రంప్‍ అసత్యాలు పలికారు.

గత మంగళవారం ప్రశాంతంగా నిర్వహిస్తున్న నిరసనలపై 17 ఏండ్ల కైలీ రిటెన్‍హౌస్‍ చేసిన కాల్పుల్లో ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే. ఈ కాల్పులు చేసిన తరువాత తుపాకితీతో సహా పోలీస్‍ లైన్ల ద్వారా వెళ్లడానికి రిటెన్‍హౌస్‍ను అనుమతించారు. అరెస్టు కనీసం ప్రశ్నించడానికి కూడా అతన్ని ఆపలేదు. తరువాత ఇల్లినాయిస్లోని తన నివాసంలో రిటెన్‍హౌస్‍ను అరెస్టు చేశారు.

No comments:

Post a Comment