Wednesday, September 2, 2020

భారతీయులు బుద్ధిష్ట్ ల పాలిట విల్లన్ లా? పూరీ జగన్నాథ్ కి ఏమైంది?

 

BUDDHISM Puri Musings by Puri Jagannadh

"ఏ తప్పు చేయని బుద్ధిష్ట్‌లను దారుణంగా చంపేశాం మనం.. వాళ్లు ఒకరికి హాని చేయరు.. కనీసం పల్లెత్తు మాట కూడా మాట్లాడరు అలాంటి వాళ్లను కర్రలతో కొట్టి చంపేశాం." ఇవి పూరి ఆరోపణలు
లాక్ డౌన్‌లో షూటింగ్ పనిని పక్కనపెట్టి.. తనకు మెదడుకు పదును పెట్టిన డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వివిధ అంశాలపై తన మార్క్ డైలాగ్‌లతో వరుస ఆడియో టేప్‌లను విడుదల చేస్తున్నారు. కులం, మతం, లవ్, ఎమోషన్స్ లాంటి బర్నింగ్ ఇష్యూస్‌పై తన స్పందనలను తెలియజేస్తున్న పూరీ జగన్నాథ్ తన యూట్యూబ్ ఛానల్‌లో బుద్ధిజంపై సంచలన కామెంట్స్ చేశారు. సిద్దార్థ్ గౌతమ్ లుంబినీలో 623 కాలంలో పుట్టాడు. ఆ తరువాత ఆయనే బుద్దుడు అయ్యాడు. ఆయనతోనే బుద్దిజం మొదలైంది. బుద్ధిజం అనేది హిందు, క్రిస్టియన్ మాతాలకంటే పురాతనమైనది. బుద్దుడు ఏం చెప్పాడంటే.. ఏ దేవుడు లేడు.. మన కోసం ఎవడూ రాడు.. ప్రతిఒక్కడు బుద్దుడే. అది మనకు నచ్చలేదు. అందరికీ కోపం వచ్చింది. అందుకే బుద్ధిష్ట్‌లను నిర్ధాక్షిష్యంగా చంపేశారు. పాపం వాళ్లు ఎవ్వరితోనూ గొడవపడరు. పల్లెత్తు మాట అనను.. జీవ హింస చేయరు. ఎప్పుడూ మెడిటేషన్‌లో ఉంటారు. కర్మని, పునర్జన్మని నమ్ముతారు. అలాంటి వాళ్లని కర్రలతో కొట్టి చంపేశాం. దేశం వదిలిపారిపోయేలా చేశాం. ఈ గొడవల్లో ఆత్మ రక్షణ కోసం బుద్ధిష్ట్‌లు కనుగొన్నదే కరాటే. చేతులే ఆయుధాలుగా చేసుకుని తమని తాము కాపాడుకోవడానికి దీన్ని కనిపెట్టారు. కరాటే అంటే ఖాళీ చేతులు అని అర్థం. సెల్ఫ్ డిఫెన్స్ ఆర్ట్ అది. చనిపోగా మిగిలిన బుద్ధిష్ట్‌లు టిబెట్, థాయ్ లాండ్, చైనా పారిపోయారు. అలా బుద్దుడు వేరే దేశాలకు దేవుడైపోయాడు.

ప్రపంచం అంతా బూడా బూడా అని మొక్కుతుంటారు. బుద్దిజమ్ వరల్డ్‌లోనే నాలుగో అతిపెద్ద మతం. ఒక చైనాలోనే 250 మిలియన్ల మంది ఉన్నారు. థాయ్ లాండ్, కంబోడియాలో 90 శాతం బుద్ధిష్ట్ పాపులేషన్ ఉంది. 1963 వియత్నాలో అక్కడున్న ప్రభుత్వం బుద్ధిష్ట్‌లను ఇబ్బంది పెడుతుంటే.. ఒక బుద్ధిష్ట్ మాంక్ దానికి నిరసనగా.. అందరూ చూస్తుండగా.. పెట్రోల్ పోసుకుని తనను తాను తగలబెట్టుకున్నాడు. మంటల్లో తగబడిపోతున్నా అతను అరవలేదు.. కదల్లేదు.. కనీసం అతని నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. కూర్చున్న చోటా మౌనంగా కాలిపోయాడు. నా కోసం ఒక్కసారి ఆ వీడియో చూడండి. అలా కాలిపోయి చనిపోవడానికి ఎంత విల్ పవర్ ఉండాలో చూడండి. యుద్ధం చేస్తూ చనిపోతే వీరమరణం అంటారు.. యద్దం చేయకుండానే వీరమరణం పొందాడు అతను. యుద్దం చేయలేక కాదు.. యుద్దం వద్దనుకున్నాడు. దటీజ్ పవర్ ఆఫ్ బుద్ధిజం. లామా అంటే టీచర్ ఆఫ్ ధర్మ అని అర్థం.. ఒక లామా చనిపోతూ తను మళ్లీ ఎక్కడ పుట్టబోతున్నాడో చెప్పి మరీ చనిపోతాడు. 

ఆ తరువాత మాంగ్స్ అందరూ కలిసి ఆ పుట్టబోయే బిడ్డకోసం వెతకుతారు. ఆ పిల్లాడిని లామా చేస్తారు. ఇప్పుడున్న దలైలామాని గుర్తించడానికి వాళ్లకి నాలుగేళ్లు పట్టింది. మనం బుద్ధుడ్ని వాడం.. ఓన్లీ బుద్ధుడి బొమ్మల్ని వాడతాం. మసాజ్ సెంటర్లు, పార్లర్‌లు హాల్‌లో టీవీ పక్కన బుడ్డ బుడ్డ లాఫింగ్ బుద్ద బొమ్మల్ని పెట్టుకుంటాం.. ఎందుకు అంటే పీస్ కోసం అంటామ్.. ఎందుకంటే మనకి సిగ్గు లజ్జా ఉండదు మనకి. ఏ పాపం తెలియని బుద్ధిష్టుల తలలు నరికిన దేశం మనది. పీస్ గురించి మాట్లాడొచ్చా? తప్పుకదా.. ఇప్పటి వరకూ ఏ బుద్ధిష్ట్ ఎవర్నీ చంపలేదు. వాళ్లు తలచుకుంటే.. ఒక్కో మాంక్ ఒట్టిచేతులతో వంద మందిని చంపగలడు. కాని ఎప్పుడూ అలా చేయలేదు. కాని మనం ఎంతో మంది బుద్దుల్ని చంపేశాం. ఒకరికి హాని చేయని మౌనంగా ఉన్న మునిలను కూడా వదలం మనం.. తలలు నరకుతాం. మతం మత్తులో ఉన్న శాడిష్టులం మనం. బుద్ధిష్టులు ఎలాగూ తిట్టరు.. తప్పుడు మాట వాళ్ల నోటిలోనుంచి రాదు.. 2000 సంవత్సరాల తరువాత కనీసం నన్నైనా మనస్పూర్తిగా తిట్టనీయండి’ అంటూ పచ్చి బూతుతో ముగించారు పూరీ జగన్నాథ్.

https://youtu.be/a1FyVe3taw4

No comments:

Post a Comment